TS Congress: కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మేనిఫెస్టో.. పరీక్షల సమయంలో విద్యార్థులకు మెట్రోలో ఫ్రీ జర్నీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించి ఏర్పాట్లు చేస్తుంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడుతుందని వినికిడి. అన్ని పార్టీలు ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. బీఎస్పీ 20 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ, కాంగ్రెస్లు కూడా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఎన్నికల్లో మేనిఫెస్టో ప్రధానం. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామంటూ పార్టీలు మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. ఇది వారి విజయానికి దోహదపడుతుంది. ఒక పార్టీ ప్రజలను ఆకట్టుకునే మేనిఫెస్టోను తయారు చేస్తే ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ నెల 16న వరంగల్ సభతో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు బీఆర్ ఎస్ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే అమలవుతున్న పథకాలతో పాటు కొత్త పథకాలు అమలుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్తో పాటు ఆరు హామీలను ప్రకటించింది. ఈ ఆరు హామీలలో మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం మరియు చేయూత ఉన్నాయి.
అయితే గ్రేటర్ హైదరాబాద్ కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధరబాబు అధ్యక్షతన మంగళవారం (అక్టోబర్ 3) గాంధీభవన్లో కమిటీ సమావేశం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లోని ప్రధాన అంశాలు, ఏయే హామీలను పొందుపరచాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించారు. విద్యార్థులకు ఉచితంగా మెట్రో ప్రయాణం కల్పించే అంశం సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే అన్ని రోజులు కాకుండా పరీక్ష రోజుల్లో మాత్రమే విద్యార్థులకు ఉచిత మెట్రో ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అలాగే రేషన్ షాపులను సూపర్ మార్కెట్లుగా మార్చే అంశంపై కూడా బీలో చర్చ జరిగింది. తెలంగాణలో క్యాబ్ డ్రైవర్ల విధానాన్ని అమలు చేసే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని శ్రీధర్ బాబును ఆ సంఘం ప్రతినిధులు కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపకల్పన కోసం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది. గ్రౌండ్ లెవెల్లో పర్యటిస్తూ ప్రజలకు కావాల్సిన మేనిఫెస్టో రూపొందించేందుకు కృషి చేస్తున్నారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Bandi Sanjay: కేసీఆర్ కనిపిస్తాలేడు.. కేటీఆర్ పై అనుమానం ఉంది… బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
తాజావార్తలు
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
-
Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!