Koti Deepotsavam 2025 Day 2: కన్నుల పండుగగా.. ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2025 Day 2 : హైదరాబాద్లో భక్తి, ఆధ్యాత్మికతలతో కోటి దీపోత్సవం మహోత్సవం రెండవ రోజు కన్నుల పండుగగా సాగింది. ఎన్టీవీ–భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న ఈ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొని శివనామస్మరణతో వాతావరణాన్ని పవిత్రంగా మార్చారు. శ్రీవారి కళ్యాణం, తులసి అర్చన, మహాపూజలు, ఆశీర్వచనాలు భక్తుల మనసును తాకగా, ఆధ్యాత్మిక ఆరాధనతో నిండిన వేదికలో కార్తీకమాస భక్తి వైభవం మరింత ప్రకాశించింది.
కార్తీకమాసం శివారాధనకు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. దీపాన్ని వెలిగించడం ద్వారా అంధకారాన్ని తొలగించి ఆత్మజ్యోతి ప్రకాశించనిచ్చే సంకేతంగా భావిస్తారు. కోటి దీపోత్సోవంలో రెండవ రోజులో భాగంగా.. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారిచే ప్రవచనామృతం వినిపించారు. తరువాత తలకాడు శ్రీ బాలకృష్ణానంద మహాసంస్థానం శ్రీ గోవిందానంద సర్వతి స్వామిజీ వారిచే అనుగ్రహభాషణం భక్తులను అలరించింది. అంతేకాకుండా.. శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థానం పూజ్య శ్రీ విద్యాశంకర భారతీ మహాస్వామిజీచే ఆశీర్వచన కార్యక్రమం వైభవంగా సాగింది.
Also Read
- Bhatti Vikramarka : SIRను అడ్డంపెట్టుకుని అసలైన ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోంది
- KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడిపోయింది.. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!
- Ramchander Rao: మా మంత్రులు, ఎంపీలే అన్ని చేస్తే.. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు?
- sonam wangchuk: "మాకు మంత్రి పదవులపై ఆశ లేదు".. విద్యా వ్యవస్థ లోపాలపై సోనామ్ వాంగ్చుక్ కీలక వ్యాఖ్యలు..

అయితే.. రెండవ రోజు కార్యక్రమంలో ముఖ్యంగా సర్వారిష్టాలు నివారించే ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. ఇదే కాకుండా.. వేదికపై శ్రీవేంకటేశ్వరస్వామికి కోటితులసి అర్చన, మొట్టమొదటిసారిగా తిరువనంతపురం శ్రీ అనంతపద్మనాభస్వామికి మహాపూజను భక్తులు తిలకించారు. భక్తులచే శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాలకు కోటి తులసి అర్చన గావించారు.
కళ్యాణ అనంతరం స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. చివరలో సప్త హారతి, లింగోద్భావంతో రెండవ రోజు కోటి దీపోత్సవం వేడుక విజయవతంగా ముగిసింది. ప్రతి దీపం ఒక భక్తుని ఆత్మజ్యోతి అనే భావనను ప్రతిబింబించిన ఈ కోటి దీపోత్సవం, కార్తీకమాస భక్తి వైభవానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ఈనెల 13 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే..
తాజావార్తలు
-
Bhatti Vikramarka : SIRను అడ్డంపెట్టుకుని అసలైన ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోంది
-
Che Guevara: ఆ రూపం ఒక బ్రాండ్.. ఆ పేరు ఒక చరిత్ర.. నేడు చేగువేరా జయంతి!
-
SIPRI Report: పాకిస్తాన్ అణు అహంకారం బద్దలు.. ఆపరేషన్ సిందూర్పై సంచలన రిపోర్ట్..
-
KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడిపోయింది.. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!
-
VIJAY : తమిళనాడు సీఎం విజయ్ – భార్య సంగీతను కలిపేందుకు ప్రయత్నాలు
ట్రెండింగ్
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!