బీజేపీ ప్రభుత్వ అకృత్యాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది: కొప్పుల ఈశ్వర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ప్రభుత్వ అకృత్యాల పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి సంస్థను అమ్మేయాలనే కుట్ర బీజేపీ చేస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి గొడ్డలిపెట్టులా సింగరేణి సంస్థను అమ్మేసే ప్రయత్నం చేస్తుందన్నారు. లాభాల్లో నడిచే సంస్థలను ప్రవేట్ పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేంద్రం నిర్ణయాన్ని సింగరేణి కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొత్త బ్లాకులు తవ్వుకోవడాని పర్మిషన్ ఇవ్వకపోగా..ఉన్న బ్లాకులను ప్రైవేటు పరం చేస్తున్నారని కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత బొగ్గు ఉత్పత్తి ,రవాణా రంగంలో సింగరేణి గణనీయమైన వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. కార్మిక, పారిశ్రామిక వ్యతిరేక విధానాలను ఎండగడతామని కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు పోరాడాలని మంత్రి సూచించారు.
సింగరేణి సంస్థను బొందపెట్టాలని కేంద్రం చూస్తోంది: బాల్క సుమన్
సింగరేణి ని బొంద పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని బాల్క సుమన్ ఆరోపించారు. సింగరేని కార్మికుల తరపున పోరాటం ఉధృతం చేస్తామన్నారు. సింగరేణిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని పలు మార్లు సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రికి లేఖ రాసిన స్పందన లేదన్నారు. మోడీ దోస్త్ లకు సింగరేణి సంస్థను అప్పగించే కుట్ర బీజేపీ చేస్తుందన్నారు. సింగరేణి ప్రైవేటు పరం అయితే వారసత్వ ఉద్యోగాలు కొనసాగిస్తారా..? అంటూ ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో సింగరేణి ప్రాంతంలో ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తాం. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? టీఆర్ఎస్ను తిట్టడం తప్ప బీజేపీకి తెలంగాణ ప్రయోజనాలు పట్టవా అంటూ విమర్శించారు. బీజేపీ నేతల పై సింగరేణి కార్మికులు తిరగబడాలి, నిలదీయాలిన్నారు. పార్లమెంట్ సమవేశాల సందర్భంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని బాల్క సుమన్ పేర్కొన్నారు.
Also Read
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
- TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్!
- BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
- OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
తాజావార్తలు
-
Samantha: ‘సామ్ జామ్’ తర్వాత హోస్ట్గా మళ్లీ సమంత.. తమిళంలో కొత్త టాక్ షో ప్లాన్?
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
EPFOలో కీలక మార్పులు.. పోర్టల్లో రెండు సేవలకు ముగింపు..
-
Dell Alienware 15: డెల్ ఏలియన్వేర్ 15 గేమింగ్ ల్యాప్టాప్ భారత్లో విడుదల.. RTX 4050 GPU, AMD Ryzen ప్రాసెసర్
-
Prithviraj Sukumaran: తెలుగులో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఐ, నోబడీ’ రిలీజ్
ట్రెండింగ్
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!