Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డి ప్రగతి భవన్పై అలా అనకుండా.. ఇలా అంటే బాగుండేది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రేవంత్ రెడ్డి ఇటీవల ప్రగతి భవన్ ను నక్సల్స్ పేల్చేయాలని కామెంట్స్ చేశారు. కాగా, రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని.. ప్రగతి భవన్ కేసీఆర్ సొత్తు కాదని.. అది ప్రజల ఆస్తి అని అన్నారు. ప్రగతి భవన్ ను ప్రజాదర్భార్ కోసం వినియోగించుకోవాలనో, ఆస్పత్రిగా వాడుకోవాలనో రేవంత్ రెడ్డి అంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
స్టార్ క్యాంపెనర్ గా త్వరలో యాత్ర ప్రారంభిస్తా అని.. పాదయాత్రనా..? బస్సుయాత్రనా..? బైకు యాత్రనా..? అనేది త్వరలో డిసైడ్ చేస్తా అని అన్నారు. పాదయాత్ర చేస్తే సమస్యలు తెలుసుకునే అవకాశం తక్కువగా ఉంటుందని.. పాదయాత్రలో అనుచరుల హడావిడి తప్పా, ప్రజా సమస్యల ప్రస్తావన తక్కువగా ఉంటుందని అన్నారు.. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి తప్పా ఇంకోటి కాదని, వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో సంక్షేమపైనే ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉందని అన్నారు.
Also Read
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
Read Also: Jagga Reddy: సీఎం కేసీఆర్తో జగ్గారెడ్డి భేటీ.. తప్పేముందంటూ ప్రశ్న..
బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలు: అంజన్ కుమార్ యాదవ్.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గజదొంగ అని, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి అక్రమంగా తన పార్టీలో చేర్చుకున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగలని విమర్శించారు. పదవులు, ఇతర ప్రలోభాల ఆశ చూపించి తీసుకున్నావ్ ఇంతకన్నా దౌర్భగ్యం ఏమైనా ఉంటుందా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎమ్మెల్యే ల కొనుగోలు అంశాలు సీబీఐ పరిధిలో విచారణ జరుపుతున్న సందర్భంగా మా పార్టీ ఎమ్మెల్యేల విషయం కూడా విచారన చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై గతంలోనే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టామని ఆయన అన్నారు. ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి డీజీపీకి ఫిర్యాదు చేశారని..12 మంది చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కేసీఆర్ వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు.
- Tags
తాజావార్తలు
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..