Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డి ప్రగతి భవన్పై అలా అనకుండా.. ఇలా అంటే బాగుండేది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రేవంత్ రెడ్డి ఇటీవల ప్రగతి భవన్ ను నక్సల్స్ పేల్చేయాలని కామెంట్స్ చేశారు. కాగా, రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని.. ప్రగతి భవన్ కేసీఆర్ సొత్తు కాదని.. అది ప్రజల ఆస్తి అని అన్నారు. ప్రగతి భవన్ ను ప్రజాదర్భార్ కోసం వినియోగించుకోవాలనో, ఆస్పత్రిగా వాడుకోవాలనో రేవంత్ రెడ్డి అంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
స్టార్ క్యాంపెనర్ గా త్వరలో యాత్ర ప్రారంభిస్తా అని.. పాదయాత్రనా..? బస్సుయాత్రనా..? బైకు యాత్రనా..? అనేది త్వరలో డిసైడ్ చేస్తా అని అన్నారు. పాదయాత్ర చేస్తే సమస్యలు తెలుసుకునే అవకాశం తక్కువగా ఉంటుందని.. పాదయాత్రలో అనుచరుల హడావిడి తప్పా, ప్రజా సమస్యల ప్రస్తావన తక్కువగా ఉంటుందని అన్నారు.. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి తప్పా ఇంకోటి కాదని, వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో సంక్షేమపైనే ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉందని అన్నారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
Read Also: Jagga Reddy: సీఎం కేసీఆర్తో జగ్గారెడ్డి భేటీ.. తప్పేముందంటూ ప్రశ్న..
బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలు: అంజన్ కుమార్ యాదవ్.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గజదొంగ అని, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి అక్రమంగా తన పార్టీలో చేర్చుకున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగలని విమర్శించారు. పదవులు, ఇతర ప్రలోభాల ఆశ చూపించి తీసుకున్నావ్ ఇంతకన్నా దౌర్భగ్యం ఏమైనా ఉంటుందా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎమ్మెల్యే ల కొనుగోలు అంశాలు సీబీఐ పరిధిలో విచారణ జరుపుతున్న సందర్భంగా మా పార్టీ ఎమ్మెల్యేల విషయం కూడా విచారన చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై గతంలోనే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టామని ఆయన అన్నారు. ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి డీజీపీకి ఫిర్యాదు చేశారని..12 మంది చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కేసీఆర్ వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు.
- Tags
తాజావార్తలు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!