Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి దాడి.. 15 గ్రామాల్లో హై అలర్ట్..
- ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతున్న పులుల దాడులు..
- నిన్న మహిళ లక్ష్మీ పై దాడి చేసి హతమార్చిన పులి..
- చేనులో పని చేస్తున్న రౌత్ సురేష్ అనే రైతు పై పులి దాడి..
- మెడ పై తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడులు కొనసాగుతున్నాయి. నిన్న లక్ష్మీ అనే మహిళపై పులి దాడి ఘటన మరువక ముందే ఇవాళ ఉదయం మరో రైతుపై దాడి చేసింది. సిర్పూర్ టౌన్ దుబ్బగూడ వద్ద చేనులో పని చేస్తున్న రౌత్ సురేష్ అనే రైతుపై పులి దాడి చేసింది. దీంతో సురేష్ గట్టిగా కేకలు వేశాడు. గమనించిన తోటి రైతులు అక్కడకు పరుగున రావడంతో పులి అక్కడి నుంచి పరార్ అయ్యింది. సురేష్ పులి దాడి చేయడంతో మెడపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రికి తరలించి సురేష్ను చికిత్స అందించారు. అయితే సురేష్ పరిస్థితి విషమించడంతో ప్రథమ చికిత్స కోసం సిర్పూర్ నుంచి కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. కాగా.. పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. కాగజ్నగర్ మండలంలో ఆంక్షలు విధించారు. ఇప్పటికే 15 గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు.
Read also: MLA Aadi Srinivas: వాడు వీడు అంటే మేము అనాల్సి వస్తుంది.. కేటీఆర్పై ఎమ్మెల్యే ఫైర్..
Also Read
- Human Trafficking: మానవ అక్రమ రవాణా బండారం బట్టబయలు.. ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షల చొప్పున అమ్మకాలు..!
- Mother Love: పేగు బంధం అంటే ఇదే కాబోలు.. తన దూడ చనిపోయిన చోటుకు అధికారులను తీసుకెళ్లిన ఆవు..
- Tiger Tension : పులి పంజా.. తిర్యాని మండలంలో దాడి..!
- Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు..
పులి కదలికలపై నిఘా పెట్టేందుకు ఎక్కడికక్కడ బోనులు, కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈద్గాం, నజ్రల్ నగర్, సీతానగర్, అనుకాడ, గన్నారం, కదంబ, ఆరెగూడ, బాబునగర్ ప్రాంతాల్లో పులి సంచరిస్తోందని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతానికి సమీపంలో నివసించే ప్రజలు పొలం పనులకు వెళ్లవద్దని హెచ్చరించారు. గత నాలుగేళ్లలో ఇక్కడ పులుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని అన్నారు. అందుకే ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. ఈ పులి దాడిలో గత నాలుగేళ్లలో నలుగురిపై దాడి చేయడంతో మృతి చెందారని అన్నారు. దీంతో పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు. పులుల దాడిలో మరణించిన వారంతా పొలం పనులకు వెళ్లినవారే వుండటం గమనార్హం.
Read also: Virat Kohli: నేను ఆర్సీబీకి మద్దతు ఇస్తానని విరాట్తో చెప్పాను: ఆస్ట్రేలియా మంత్రి టిమ్ వాట్స్
వరుసగా మనుషులపై పులుల దాడితో జనం బెంబేలెత్తి పోతున్నారు. నిన్న దాడి చేసిన పులి ఈరోజు దాడి చేసిన పులి ఒక్కటేనా అని అనుమానం వ్యక్తం చేశారు. రెండు దాడులకు కారణాలపై అటవీశాఖ అధికారుల ఆరా తీస్తున్నారు. కొత్తగా వచ్చిన పులిగా అధికారులు భావిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి దాడి చేసి ఉంటుదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
KTR Tweet: కొద్ది రోజులు రెస్ట్ కావాలి.. కేటీఆర్ సంచలన ట్వీట్..
తాజావార్తలు
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
-
Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?
-
Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..
-
Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు?
-
Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్ప్లే, GPS ఫీచర్లతో అదిరింది
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!