Kishan Reddy: సికింద్రాబాద్, అంబర్ పేట లో కిషన్ రెడ్డి పర్యటన.. షెడ్యూల్ ఇదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ఈ నెల13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలింగ్ శాతాన్ని పెంచాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ఎంపీగా తనను ఆశీర్వదించాలని, దేశంకోసం మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని ఆయన కోరారు. ఈ మేరకు సికింద్రాబాద్, అంబర్ పేట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాల ఉదయం సికింద్రాబాద్ నియోజకవర్గంలో సాయంత్రం అంబర్ పేట్ లో పర్యటించనున్నారు. ఉదయం 9:20 గంటలకు లాలాపేట్ జ్యోతిరావు పూలే స్టాచు నుంచి కిషన్ రెడ్డి పర్యటన మొదలుకానుంది.
Read also: KCR: నేడు కరీంనగర్లో కేసీఆర్ రోడ్ షో.. తెలంగాణచౌక్ వరకు ర్యాలీ
Also Read
అక్కడి నుంచి శాంతినగర్, టీచర్స్ కాలనీ, విజయపురి కాలనీ, తార్నాక మీదుగా బౌద్ధ నగర్, వారాసిగూడ, సీతాఫల్మండి, మైలార్ గడ్డలో ముగియనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు అంబర్పేట్ నియోజకవర్గంలోని లింగంపల్లి రాఘవేంద్ర స్వామి టెంపుల్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు. అనంతరం ఫీవర్ హాస్పిటల్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్, రెడ్ బిల్డింగ్ ఎక్స్ రోడ్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్, బాపునగర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్, పటేల్ నగర్ ఎక్స్ రోడ్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్, మహాత్మ జ్యోతి పులె స్టాచ్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్, డి మార్ట్, గోల్నాక ఎక్స్ రోడ్, స్ట్రీట్ కార్నర్ మీటింగ్, కృష్ణానగర్ అంబేద్కర్ స్టాచు స్ట్రీట్ కార్నర్ మీటింగ్, నింబోలి అడ్డ మహంకాళి టెంపుల్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహిచనున్నారు.
Read also: Amit Shah: నేడు రాష్ట్రానికి అమిత్ షా.. భువనగిరిలో పబ్లిక్ మీటింగ్..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిన్న కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత పదేండ్లు బీఆర్ఎస్ దోచుకుంటే.. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. ‘దేశం కోసం, మీ పిల్లల భవిష్యత్ కోసం బీజేపీకి ఓటు వేయండి. మోదీని మరోసారి ప్రధానిని చేద్దాం. సికింద్రాబాద్ ఎంపీగా నేను చేసిన అభివృద్ధి మీ ముందు పెట్టాను. నన్ను ఎంపీగా మరోసారి ఆశీర్వదించండి. నియోజకవర్గ అభివృద్ధిగా కృషి చేస్తాను. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేసినా వృథానే. ఎందుకంటే కేంద్రంలో మళ్లీ వచ్చిది మోడీ ప్రభుత్వమే”అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Rahul Gandhi: నేడు మెదక్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన..
తాజావార్తలు
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!