Kishan Reddy: కేంద్ర మంత్రికి ఢిల్లీ నుండి ఫోన్.. అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీకి వెళ్లారు. మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. పసుపు బోర్డు ఏర్పాటుకు, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. ఈ విషయమై కిషన్ రెడ్డిని న్యూఢిల్లీకి రావాలని కోరారు. కిషన్ రెడ్డి న్యూఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం.
ఈ నెల 2న కూడా కిషన్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ నెల 3వ తేదీన నిజామాబాద్లో జరిగిన ఇందూరు ప్రజా గర్జన సభలో తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరతానని బీఆర్ఎస్ తనతో చెప్పిందని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి కేటీఆర్ తోసిపుచ్చారు. ప్రధాని మోదీ తన స్థాయిని మరిచి అబద్దాలు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సీఈసీ నేతృత్వంలోని బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ నెల 6వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ తరుణంలో ఈ నెల 1వ తేదీన తెలంగాణకు ప్రధాని మోదీ ఇచ్చిన వరాలుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పసుపు బోర్డు అంశం కీలక పాత్ర పోషించింది. పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కూడా హామీ రాసుకున్న సంగతి తెలిసిందే.
Vijayashanti: మోడీ సభలకు విజయశాంతి డుమ్మా.. ఒక్క ట్వీట్తో క్లారిటీ ఇచ్చిన రాములమ్మ
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!