Kishan Reddy: కేంద్ర మంత్రికి ఢిల్లీ నుండి ఫోన్.. అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ..!
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీకి వెళ్లారు. మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. పసుపు బోర్డు ఏర్పాటుకు, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. ఈ విషయమై కిషన్ రెడ్డిని న్యూఢిల్లీకి రావాలని కోరారు. కిషన్ రెడ్డి న్యూఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం.
ఈ నెల 2న కూడా కిషన్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ నెల 3వ తేదీన నిజామాబాద్లో జరిగిన ఇందూరు ప్రజా గర్జన సభలో తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరతానని బీఆర్ఎస్ తనతో చెప్పిందని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి కేటీఆర్ తోసిపుచ్చారు. ప్రధాని మోదీ తన స్థాయిని మరిచి అబద్దాలు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సీఈసీ నేతృత్వంలోని బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ నెల 6వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ తరుణంలో ఈ నెల 1వ తేదీన తెలంగాణకు ప్రధాని మోదీ ఇచ్చిన వరాలుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పసుపు బోర్డు అంశం కీలక పాత్ర పోషించింది. పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కూడా హామీ రాసుకున్న సంగతి తెలిసిందే.
Vijayashanti: మోడీ సభలకు విజయశాంతి డుమ్మా.. ఒక్క ట్వీట్తో క్లారిటీ ఇచ్చిన రాములమ్మ
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
- Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!