Kishan Reddy: కేంద్ర మంత్రికి ఢిల్లీ నుండి ఫోన్.. అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీకి వెళ్లారు. మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. పసుపు బోర్డు ఏర్పాటుకు, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. ఈ విషయమై కిషన్ రెడ్డిని న్యూఢిల్లీకి రావాలని కోరారు. కిషన్ రెడ్డి న్యూఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం.
ఈ నెల 2న కూడా కిషన్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ నెల 3వ తేదీన నిజామాబాద్లో జరిగిన ఇందూరు ప్రజా గర్జన సభలో తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరతానని బీఆర్ఎస్ తనతో చెప్పిందని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి కేటీఆర్ తోసిపుచ్చారు. ప్రధాని మోదీ తన స్థాయిని మరిచి అబద్దాలు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సీఈసీ నేతృత్వంలోని బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ నెల 6వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ తరుణంలో ఈ నెల 1వ తేదీన తెలంగాణకు ప్రధాని మోదీ ఇచ్చిన వరాలుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పసుపు బోర్డు అంశం కీలక పాత్ర పోషించింది. పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కూడా హామీ రాసుకున్న సంగతి తెలిసిందే.
Vijayashanti: మోడీ సభలకు విజయశాంతి డుమ్మా.. ఒక్క ట్వీట్తో క్లారిటీ ఇచ్చిన రాములమ్మ
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!