Kishan Reddy: బీజేపీ అంటే ఓ నమ్మకం.. ఢిల్లీలో విజయం సాధిస్తున్నాం.. అదే ఊపుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటుతోంది
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- ఢిల్లీలో విజయం సాధిస్తున్నాం
- అదే ఊపుతో అదే ఊపుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన సత్తా చాటుతోంది. 43 స్థానాల్లో లీడింగ్ లో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పై బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, రాష్ర్ట పదాదికారులతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఢిల్లీ ఎన్నికల ఫిలితాలపై ప్రస్తావించారు. ఢిల్లీలో విజయం సాధిస్తున్నామని అన్నారు. అదే ఊపుతో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ అంటే ఓ నమ్మకం. నిజాయతీ పాలన బీజేపీ తోనే సాధ్యమని ఢిల్లీ ప్రజలు విశ్వసించారు.దేశ రాజధాని ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేస్తున్నాం. తెలంగాణలో కూడా సానుకూల వాతావరణం ఉంది. దాన్ని గెలుపుగా మలచుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
ఢిల్లీలో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తుండగా కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటున్నారు. డిల్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ కి అనుకూలంగా ఉండడంతో సంబరాలు చేసుకోవడానికి పార్టీ ఆఫీసుకు కార్యకర్తలు చేరుకుంటున్నారు. కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో కూర్చుని డిల్లీ ఎన్నికల ఫలితాలు Ntv స్క్రీన్ లో వీక్షిస్తున్నారు. డిల్లీ ఫలితాలపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఎద్దేవ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్కు గాడిద గుడ్డు వచ్చింది.. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కు గాడిద గుడ్డే వస్తుంది.. బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయం.. ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోయిందని సెటైర్స్ వేశారు.
Also Read
- Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
- KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
- Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే 'కమలం' వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై NTV తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఢిల్లీ లో బీజేపీ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఢిల్లీ లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ విజయం బీజేపీ శ్రేణులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఇప్పటి నుంచి ప్రజా రంజకమైన పాలన చూడబోతున్నారు. ఆంద్రప్రదేశ్ లో కూడా బీజేపీని బలోపేతం చేయడానికి ఈ విజయం బూస్టప్ గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో మొదట సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేస్తున్నాం అని పురందేశ్వరి తెలిపారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!