Telangana BJP: తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్గా కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana BJP: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తున్నట్లు జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. బండి సంజయ్ కు కొత్త బాధ్యతలు అప్పగిస్తామని ఆయన హామి ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే.. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కొత్త అధ్యక్షుడిగా సత్యకుమార్ ను నియమిస్తున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు జేపీనడ్డా తనకు ఫోన్ చేసి చెప్పినట్లు సోము వీర్రాజు మీడియాకు తెలిపారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. అయితే బండి సంజయ్ కు కొత్త బాధ్యతలు అప్పగిస్తారన్నదానిపై ఉత్కంఠత నెలకొంది. అయితే ఏపీ బీజేపీ చీఫ్ ను ఇవాళ సాయంత్రం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఏపీ బీజేపీ చీఫ్ గా సత్య కుమార్ ను నియమిస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
మరికొద్ది నెలల్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ పార్టీలో కీలక మార్పులు చేయనుంది. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రానున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. ఐదు రాష్ట్రాల అధ్యక్షులను మార్చే అవకాశం ఉంది. మరికొద్ది గంటల్లో ఈ ఐదు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను భాజపా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి. కొద్దిరోజుల క్రితం ప్రధాని మోడీ ఎన్నికల సన్నాహకానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు, ఇందులో భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. ఈ సమయంలో రాష్ట్రాలలో అధ్యక్షులను మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ మార్చబోతోంది. ఈ రాష్ట్రాల బాధ్యతలను పార్టీ కొత్తవారికి అప్పగించవచ్చు. తెలంగాణ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డిని, పంజాబ్ అధ్యక్షుడిగా జేపీ నాగ, సునీల్ జాఖర్, కర్ణాటక అధ్యక్షుడిగా అశ్వత్ నారాయణ్ లేదా శోభాను నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో మధ్యప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను కీలక నేతలకు అప్పగించనున్నారు.
Also Read
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
తెలంగాణ విషయానికి వస్తే కిషన్ రెడ్డికి గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుత అధ్యక్షుడిగా బండి సంజయ్కు మంచి మార్కులు ఉన్నప్పటికీ తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయనను మార్చాల్సి వచ్చిందని బీజేపీ నేతలు అంటున్నారు.బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి వస్తాడనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. ఇన్ని రోజులు ఖండిస్తున్న బీజేపీ నేతలు కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యారు. అదే సమయంలో హన్మకొండలో జరిగిన సభలో బండి సంజయ్ కూడా కాస్త భావోద్వేగానికి గురయ్యారు. 8న రాష్ట్ర అద్యక్షుని హోదాలో ప్రధాని బహిరంగ సభకు వస్తానో రానో..! అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మార్పు ఖాయమని పార్టీ వర్గాలు ధృవీకరించాయి.
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!