Kishan Reddy: పాటిగడ్డ కాలనీ కట్టి 15 ఏళ్లు.. అయినా పేదలకు ఇళ్లు ఇవ్వలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: పాటిగడ్డ కాలనీలో సుమారు 15 ఏండ్ల కిందట కట్టిన ఇండ్లు పేదలకు ఇంతవరకు ఇవ్వలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేట్, ఓల్డ్ పాటిగడ్డ బస్తిలో కిషన్ రెడ్డి పర్యటించారు. సమస్యల పరిష్కారం కోసం బస్తీ బాట పట్టారు. బస్తీల్లో సమస్యలపై ఆరా తీస్తూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజలతో బాధ్యతాయుతంగా మెదులుతూ.. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 30 శాతం పైగా జనాభా హైదరాబాద్ లో ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంతో పాటు అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దామని కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ప్రచారం చేసుకున్నారని అన్నారు. కేవలం ధనవంతులు ఉన్నచోటే.. హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఎకనామిక్ సిటీ పేరుతో ఫ్లైఓవర్స్ కట్టి రంగులుపూసి ప్రచారం చేసుకొని గత ఎన్నికల్లో ఓట్లు పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయిన్ రోడ్లు దిగి బస్తీల్లో పర్యటించాలని కేటీఆర్ కి గతంలో పదేపదే గుర్తుచేశామన్నారు. అయినా ఏనాడు కూడా వారు బస్తీలను పట్టించుకోలేదని మండిపడ్డారు.
Read also: Indigo Ayodhya Flight: అయోధ్యకు కొత్త విమాన సర్వీసును ప్రారంభించిన ఇండిగో.. ఛార్జీ ఎంతంటే ?
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
పేద ప్రజలు నివసించే బస్తీలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రోడ్లు, వీధిలైట్లు లేక, డ్రైనేజీ సమస్యలతో పాటు కనీస సదుపాయాలకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మహిళలకు స్కిల్ డెవలప్ సెంటర్లు లేవు.. ప్రభుత్వ పాఠశాలలు పాత భవనాలతో పూర్తిగా నిరుపయోగంగా తయారయ్యాయని అన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే నడుస్తుండటం సరికాదన్నారు. పాటిగడ్డ కాలనీలో సుమారు 15 ఏండ్ల కిందట కట్టిన ఇండ్లు పేదలకు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో గతంలో పేదల కోసం నిర్మించిన ఇండ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి అలాట్ మెంట్ చేయాలన్నారు. ఇప్పటికీ చాలా బస్తీల్లో విద్యుత్ కనెక్షన్లకు నోచుకోని దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదలపై చిత్తశుద్ధి ఉంటే పేద ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.
Kadiyam Srihari: పొంగులేటి అలా, భట్టి సతీమణి ఇలా.. కడియం సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
-
West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
-
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్హౌస్ కీలక ప్రకటన
-
Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?