Kishan Reddy: పాటిగడ్డ కాలనీ కట్టి 15 ఏళ్లు.. అయినా పేదలకు ఇళ్లు ఇవ్వలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: పాటిగడ్డ కాలనీలో సుమారు 15 ఏండ్ల కిందట కట్టిన ఇండ్లు పేదలకు ఇంతవరకు ఇవ్వలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేట్, ఓల్డ్ పాటిగడ్డ బస్తిలో కిషన్ రెడ్డి పర్యటించారు. సమస్యల పరిష్కారం కోసం బస్తీ బాట పట్టారు. బస్తీల్లో సమస్యలపై ఆరా తీస్తూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజలతో బాధ్యతాయుతంగా మెదులుతూ.. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 30 శాతం పైగా జనాభా హైదరాబాద్ లో ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంతో పాటు అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దామని కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ప్రచారం చేసుకున్నారని అన్నారు. కేవలం ధనవంతులు ఉన్నచోటే.. హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఎకనామిక్ సిటీ పేరుతో ఫ్లైఓవర్స్ కట్టి రంగులుపూసి ప్రచారం చేసుకొని గత ఎన్నికల్లో ఓట్లు పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయిన్ రోడ్లు దిగి బస్తీల్లో పర్యటించాలని కేటీఆర్ కి గతంలో పదేపదే గుర్తుచేశామన్నారు. అయినా ఏనాడు కూడా వారు బస్తీలను పట్టించుకోలేదని మండిపడ్డారు.
Read also: Indigo Ayodhya Flight: అయోధ్యకు కొత్త విమాన సర్వీసును ప్రారంభించిన ఇండిగో.. ఛార్జీ ఎంతంటే ?
Also Read
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
- OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
పేద ప్రజలు నివసించే బస్తీలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రోడ్లు, వీధిలైట్లు లేక, డ్రైనేజీ సమస్యలతో పాటు కనీస సదుపాయాలకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మహిళలకు స్కిల్ డెవలప్ సెంటర్లు లేవు.. ప్రభుత్వ పాఠశాలలు పాత భవనాలతో పూర్తిగా నిరుపయోగంగా తయారయ్యాయని అన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే నడుస్తుండటం సరికాదన్నారు. పాటిగడ్డ కాలనీలో సుమారు 15 ఏండ్ల కిందట కట్టిన ఇండ్లు పేదలకు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో గతంలో పేదల కోసం నిర్మించిన ఇండ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి అలాట్ మెంట్ చేయాలన్నారు. ఇప్పటికీ చాలా బస్తీల్లో విద్యుత్ కనెక్షన్లకు నోచుకోని దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదలపై చిత్తశుద్ధి ఉంటే పేద ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.
Kadiyam Srihari: పొంగులేటి అలా, భట్టి సతీమణి ఇలా.. కడియం సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
-
INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!