Kishan Reddy: 4 నెలలుగా ఎందుకు చేయలేదు.. అధికారులపై కిషన్ రెడ్డి సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: నాంపల్లి నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మల్లెపల్లి డివిజన్ అఘాపురంలో పవర్ బోర్ ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. గడగడపకు వెళుతూ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా.. నాంపల్లి వద్ద పర్యటించిన కిషన్ రెడ్డికి స్థానికులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపారు. స్ట్రీట్ లైట్లు లేవని, అర్ధరాత్రి బస్తిలో బయటకు రావాలంటే భయంగా ఉందని వాపోయారు. నవంబర్ లో పిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని.. నాలుగు నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని తెలిపారు. బస్తిలో అర్థరాత్రి నడవాలంటే భయం భయంతో ఇళ్లకు చేరుకోవాల్సి వస్తుందని తెలిపారు. అధికారులకు చెప్పి బస్తిలో స్ట్రీట్ లైట్లు వేయించాలని తెలిపారు.
Read also: Tollywood Films: టాలీవుడ్ అత్యంత లాభదాయకమైన సినిమాలు…!
Also Read
- Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
దీంతో స్థానికుల సమస్యలను విన్న కేంద్ర మంత్రి వెంటనే అధికారులకు అక్కడకు పిలిపించారు. ఎందుకు స్ట్రీట్ లైట్స్ వేయలేదని ప్రశ్నించారు. ఒకటి కాదు రెండు రోజులు కాదు నాలుగు నెలలుగా సమస్య చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ సీరియస్ అయ్యారు. అయితే అధికారులు నిధులు లేవని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే Ghmc కమిషనర్ కు ఫోన్ కలిపారు. స్ట్రీట్ లైట్స్ కోసం అధికారులను అడిగితే నిధులు లేవని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నాలుగు నెలలుగా కంప్లైంట్ ఇచ్చిన ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. నిధులు లేవని ప్రజలను అంధకారంలో ఉండమంటారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించింది మల్లేపల్లి డివిజన్ అఘాపురలో వెంటనే స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలని కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. అయితే కేంద్రమంత్రి ఆదేశాలకు కమిషనర్ స్థానికంగా స్పందించినట్లు సమాచారం.
Facebook Fraud: ఆన్లైన్ మోసానికి స్నేహితులు బలి.. రూ. 1.60 లక్షలు స్వాహా.!
తాజావార్తలు
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..