Miryalguda Accident: మిర్యాలగూడ రోడ్డు ప్రమాదం.. పోలీసుల అదుపులో లారీ డ్రైవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miryalguda Accident: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ లో ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందిన సంచలనంగా మారింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో కారును ఢీ కొట్టిన లారీని పోలీసులు గుర్తించారు. టోల్గేట్ లో సిసి పుటేజ్ ఆధారంగా లారీని అద్దంకి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్కెట్పల్లికి చెందిన పొట్టు లారీగా గుర్తించారు. కారును ఢీకొట్టిన అతను భాయందోళనకు గురయ్యాడని. అక్కడి నుంచి ఎవరూ గుర్తించకుండా లారీని స్పీడ్ గా నడుపుతూ పరారయ్యాడని తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గంటల్లోనే నిందితున్ని పట్టుకున్నారు.
Read also: Facebook Fraud: ఆన్లైన్ మోసానికి స్నేహితులు బలి.. రూ. 1.60 లక్షలు స్వాహా.!
Also Read
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
మిర్యాలగూడలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంటికి చేరుకునేలోపే మృత్యువు లారీ రూపంలో కబలించింది. రెండు కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేష్ (32), అతని భార్య జ్యోతి (30), కుమార్తె రిషిత (6), యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లికి చెందిన భూమా మహేందర్ (32), అతని కుమారుడు లియాన్సి (2) అక్కడికక్కడే మృతి చెందారు. మహేందర్ భార్య భూమా మాధవికి తీవ్ర గాయాలయ్యాయి. మిర్యాలగూడలో ప్రాథమిక చికిత్స అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుడు మహేష్ హైదరాబాద్ వనస్థలిపురంలో ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి కారులో బెజవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ప్రధాన రహదారిపై కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Akkineni Nagarjuna: నన్నెవ్వరు నమ్మలేదు.. చివరికి అమల కూడా.. పిచ్చి పట్టిందా అన్నట్లు.. ?
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్మన్ గిల్ అవుట్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!