Facebook Fraud: ఆన్లైన్ మోసానికి స్నేహితులు బలి.. రూ. 1.60 లక్షలు స్వాహా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Facebook Fraud: ఇటీవలి కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది స్కామర్లు అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా, వాట్సాప్ కాల్స్, లింక్లు మొదలైనవి డబ్బుకోసం ఆశగా ఎదురుచూస్తున్న వారిని టార్గెట్ చేసి బురిడీ కొట్టిస్తున్నారు. విచిత్రమేమిటంటే మోసాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులే కావడం గమనార్హం. సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి ఖరీదైన వస్తువులు తక్కువ ధరకు పొందాలనే అత్యాశతో ఉన్నారు. తాజాగా ఇద్దరు స్నేహితులు ఫేస్బుక్లో ఓ ప్రకటనను నమ్మి రూ. 1.60 లక్షలు మోసపోయారు. దీంతో బాధితులు లబోదిబో మంటూ పోలీసుకులకు ఆశ్రయించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: RSS: “నో డ్రోన్” జోన్గా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మారే పల్లితండాకు చెందిన బి.ప్రవీణ్ కుమార్, మన్సాన్పల్లి తండాకు చెందిన శ్రీనులు స్నేహితులు కలిసి వ్యాపారం చేసేందుకు నెల రోజుల పాటు డీజే కొన్నారు. కానీ డీజేకి జనరేటర్ అవసరం కావడంతో ఆన్లైన్లో వెతికారు. ఈ క్రమంలో రూ.1.90 లక్షలకు జనరేటర్ దొరుకుతుందంటూ ఫేస్ బుక్ లో ఓ ప్రకటన చూశారు. అందులో ఉన్న ఫోన్ నంబర్కి కాల్ చేశారు. పుణెకు చెందిన మనీష్ రమాకాంత్ దుర్వే జనరేటర్ కోసం రూ.1.80 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ముందుగా రూ. 5 వేలు, ఆపై రూ. 10 వేలు, రూ. 20 వేలు, ఇలా మొత్తం అతని ఖాతాలో రూ.1.60 లక్షలు జమ అయ్యాయి. ప్రైవేట్ వాహనంలో జనరేటర్ పంపిస్తున్నట్లు రెండు ఫొటోలు పంపి వారిని నమ్మించాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇంటికి జనరేటర్ రాకపోవడంతో ప్రవీణ్, శ్రీనులకు అనుమానం వచ్చింది. మనీష్ రమాకాంత్ దుర్వే చెప్పిన అడ్రస్ కు పూణేలో తెలిసిన వాళ్లను పంపించారు.. అక్కడ అసలు దుకాణమే లేదని ప్రెండ్స్ చెప్పడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
Congress Free Scooty: యువతులకు ఫ్రీ స్కూటీ స్కీమ్.. అప్లై ఎలా చేయాలంటే..!
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..