Facebook Fraud: ఆన్లైన్ మోసానికి స్నేహితులు బలి.. రూ. 1.60 లక్షలు స్వాహా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Facebook Fraud: ఇటీవలి కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది స్కామర్లు అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా, వాట్సాప్ కాల్స్, లింక్లు మొదలైనవి డబ్బుకోసం ఆశగా ఎదురుచూస్తున్న వారిని టార్గెట్ చేసి బురిడీ కొట్టిస్తున్నారు. విచిత్రమేమిటంటే మోసాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులే కావడం గమనార్హం. సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి ఖరీదైన వస్తువులు తక్కువ ధరకు పొందాలనే అత్యాశతో ఉన్నారు. తాజాగా ఇద్దరు స్నేహితులు ఫేస్బుక్లో ఓ ప్రకటనను నమ్మి రూ. 1.60 లక్షలు మోసపోయారు. దీంతో బాధితులు లబోదిబో మంటూ పోలీసుకులకు ఆశ్రయించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: RSS: “నో డ్రోన్” జోన్గా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం..
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మారే పల్లితండాకు చెందిన బి.ప్రవీణ్ కుమార్, మన్సాన్పల్లి తండాకు చెందిన శ్రీనులు స్నేహితులు కలిసి వ్యాపారం చేసేందుకు నెల రోజుల పాటు డీజే కొన్నారు. కానీ డీజేకి జనరేటర్ అవసరం కావడంతో ఆన్లైన్లో వెతికారు. ఈ క్రమంలో రూ.1.90 లక్షలకు జనరేటర్ దొరుకుతుందంటూ ఫేస్ బుక్ లో ఓ ప్రకటన చూశారు. అందులో ఉన్న ఫోన్ నంబర్కి కాల్ చేశారు. పుణెకు చెందిన మనీష్ రమాకాంత్ దుర్వే జనరేటర్ కోసం రూ.1.80 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ముందుగా రూ. 5 వేలు, ఆపై రూ. 10 వేలు, రూ. 20 వేలు, ఇలా మొత్తం అతని ఖాతాలో రూ.1.60 లక్షలు జమ అయ్యాయి. ప్రైవేట్ వాహనంలో జనరేటర్ పంపిస్తున్నట్లు రెండు ఫొటోలు పంపి వారిని నమ్మించాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇంటికి జనరేటర్ రాకపోవడంతో ప్రవీణ్, శ్రీనులకు అనుమానం వచ్చింది. మనీష్ రమాకాంత్ దుర్వే చెప్పిన అడ్రస్ కు పూణేలో తెలిసిన వాళ్లను పంపించారు.. అక్కడ అసలు దుకాణమే లేదని ప్రెండ్స్ చెప్పడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
Congress Free Scooty: యువతులకు ఫ్రీ స్కూటీ స్కీమ్.. అప్లై ఎలా చేయాలంటే..!
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?