Kishan Reddy: విమోచన దినోత్సవాల్లో భాగంగానే బతుకమ్మ కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy Interesting Comments On Bathukamma Celebrations: ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ‘కర్తవ్య పథ్’లో కేంద్ర ప్రభుత్వం ఘనంగా బతుకమ్మ వేడుకల్ని నిర్వహించింది. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం.. రాత్రి 8.30 వరకు కొనసాగింది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. అంతకుముందే హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి తెలుగు మహిళలు మధ్యాహ్నం చేరుకొని.. బతుకమ్మలను అందంగా పూలతో పేర్చారు. సాయంత్రం ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మన ఆడబిడ్డల ఆత్మగౌరవమే బతుకమ్మ అని పేర్కొన్నారు. ఢిల్లీ గడ్డపై కర్తవ్య పథ్ వేదికగా ఈ సంబరాలు జరుపుకోవడంతో తెలంగాణకు మరింతగా ప్రత్యేకమైన గుర్తింపు దక్కిందన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాల్లో భాగంగా.. ఏడాదిపాటు నిర్వహించే కార్యక్రమాల్లో ఈ బతుకమ్మని ఢిల్లీలో నిర్వహించినట్టు తెలిపారు. నాడు రజాకార్లు మన ఆడబిడ్డలను అవమానిస్తూ నగ్నంగా బతుకమ్మను ఆడించిన రోజుల నుంచి.. నేడు స్వేచ్ఛగా, ఉత్సాహంగా బతుకమ్మ ఆడుకునే అవకాశం దక్కడం వెనక ఎంతోమంది త్యాగాలతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేకమైన చొరవ ఉన్నాయని తెలిపారు. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయానికి సరైన గుర్తింపును కల్పించేందుకు ఢిల్లీ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో మమేకమై జీవించడం భారతీయ జీవన విధానమని.. అలాంటి ప్రకృతిని కాపాడుకుంటూ జీవనం సాగించాలన్నదే బతుకమ్మ సందేశమని అన్నారు.
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
కాగా.. ఈ వేడుకల్లో కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, జల రవాణా మార్గాల మంత్రి సర్బానంద్ సోనోవాల్, పీఎంవో, సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, టూరిజం శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సతీమణి, కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సతీమణితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Jananayagan Censor : జననాయగన్ కు సెన్సార్ షాక్
-
Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
-
Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
-
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?