Kishan Reddy: ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా సీఎం కేసీఆర్ వ్యవహరం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా సీఎం వ్యవహరం ఉందని దుయ్యబట్టారు. ఓట్ల నిధుల కోసం ప్రభుత్వ భూములను అమ్ముతున్నారని ఆరోపించారు. అసైన్మెంట్ భూములను లాక్కొని అమ్ముకుంటోందని.. ఇది ప్రజా వ్యతిరేక చర్య, దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. సంపదను సృష్టించాలి తప్ప, నాశనం చేయకూడదని హితవు పలికారు. అనేక ఉపద్రవాలు కూడా వస్తాయ్నారు. దేశం అనుసరిస్తుందని ప్రగల్బాలు పలికే కేసీఆర్.. రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ దివాలాకోరుతనం, భూములు అమ్ముకోవడం.. వ్యవస్థ నాశనానికి నాంది అని పేర్కొన్నారు. సీఎం అసమర్థత కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
China Bubonic Plague: మరో ప్రాణాంతక వ్యాధి.. చైనాలో బయటపడ్డ బుబోనిక్ ప్లేగ్
Also Read
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
అంతకుముందు.. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా తిరంగా ర్యాలీలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. బర్కత్పురా బీజేపీ సిటీ ఆఫీస్ నుంచి నారాయణగూడ వీర్ సావర్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఆజాది కా అమృత్ మహోత్సవ’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వము చేపట్టిందన్నారు. స్వాతంత్ర వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ రెండు రోజులపాటు దేశంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతి ఒక్కరు 75వ స్వాతంత్ర వేడుకల్లో భాగ్యసాములు కావాలన్నారు. ప్రతి గ్రామంలో యువకులు తిరంగ యాత్ర మోటార్ సైకిల్లతో ర్యాలీ నిర్వహించాలన్నారు.
Karumuri Nageswara Rao : సభ్యత సంస్కారం లేని వ్యక్తి పవన్ కల్యాణ్
అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండల జిల్లా కేంద్రాలలో 75 మొక్కలు నాటాలని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా.. చెట్లను నాటే కార్యక్రమానికి అమృత వనంగా పేరు పెట్టడం జరిగింది. ప్రపంచంలో భారతదేశం విశ్వ గురువు స్థానంలో ఉండాలన్నారు. దేశంలో నిరుద్యోగ, పేదరిక సమస్యను నిర్మూలన కోసం మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని, ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకే ఈ కార్యక్రమం చేపడుతున్నామని, ప్రతి ఒక్కరు ఇందులో భాగ్యస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!