China Bubonic Plague: చైనాలో బయటపడ్డ మరో ప్రాణాంతక వ్యాధి… బుబోనిక్ ప్లేగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Bubonic Plague: ప్రపంచంలోని అగ్ర రాజ్యాల్లో ఒకటిగా చైనా కొనసాగుతోంది. చైనా ఆర్థిక రంగంలో ముందుండుగా… దాంతోపాటు కొత్త కొత్త రోగాలకు సంబంధించిన వైరస్లను తీసుకురావడంలోనూ ముందే ఉంటుంది. ఇప్పటికే ప్రపంచాన్ని అతలా కుతలం చేసిన కరోనా వైరస్ కోవిడ్-19 వైరస్ ప్రపంచాన్ని ఎంత ఇబ్బంది పెట్టిందో చూశాము. అలాగే ఇప్పుడు కొత్తగా మరో ప్రాణాంతకమైన వ్యాధి చైనాలో ప్రబలుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు కేసులు సైతం ఆ దేశంలో నమోదైనట్టు అధికారికంగా ప్రటించారు.
Read also: Sarkaru Naukari:”సర్కారు నౌకరి” సినిమా లిరికల్ సాంగ్ రిలీజ్
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
చైనాలో కొత్తగా బుబోనిక్ ప్లేగు వ్యాధి ప్రబలుతోంది. అయితే ఇదేమీ కొత్త వ్యాధేమీ కాదు. కాకపోతే.. కొత్తగా వ్యాపిస్తోంది. చైనా అధీనంలోని ఇన్నర్ మంగోలియాలో ఈ వ్యాధి ఇప్పటికే ఇద్దరికి సోకింది. చైనాకి ఉత్తర ప్రాంతంలో ఇన్నర్ మంగోలియా ఉంటుంది. శనివారం 2 బుబోనిక్ ప్లేగు వ్యాధి కేసులు కన్ఫామ్ అయినట్టు అధికారులు ప్రకటించారు. ఈ వ్యాధి ఆగస్టు 7న మొదలైనట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఓ తండ్రి, కూతురికి ఈ వ్యాధి సోకడంతో.. వారికి టెస్టులు చేసి.. శనివారం నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వ్యాధి సోకిన వారితో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న వారందర్నీ పిలిపించి టెస్టులు చేశారు. ఎవరిలోనూ అసాధారణ లక్షణాలేవీ కనిపించలేదని ఓ స్టేట్మెంట్లో అధికారులు ప్రకటించారు. డాక్టర్ల ప్రకారం.. బుబోనిక్ ప్లేగు అనేది.. చాలా వేగంగా వ్యాప్తి చెందే వ్యాధి. ఇది ఎలుకలు, చుంచెలుకలు, పందికొక్కులు ద్వారా, వాటి వ్యర్థాల నుంచి వ్యాపిస్తుంది. అవి తినగా వదిలేసిన ఆహారం నుంచి వ్యాపిస్తుంది. దీన్ని బ్లాక్ డెత్ వ్యాధి అని కూడా అంటారు. ఆఫ్రికా ఖండంలో చాలా మంది నల్ల జాతీయులు ఈ వ్యాధి బారిన పడి చనిపోతుంటారు కాబట్టి అలా పిలుస్తారు. ఈ కేసులు చైనాలో తక్కువే. కానీ ఈమధ్య కొన్నేళ్లుగా ఇన్నర్ మంగోలియా, వాయవ్య నింజియా ప్రాంతంలో ఇలాంటి కేసులు తరచూ వస్తున్నట్టు ప్రకటించారు. ప్లేగు వ్యాధుల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఈ బుబోనిక్ ప్లేగు. ఇది సోకిన వారికి తగిన సమయంలో ట్రీట్మెంట్ చెయ్యకపోతే.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకటించింది. బుబోనిక్ ప్లేగు వ్యాధి సోకి వారి శరీరంలోకి ప్లేగ్ బ్యాసిల్లస్, వై.పెస్టిస్ అనే సూక్ష్మజీవులు ఎంటర్ అవుతాయి. ఆ తర్వాత వాటి సంఖ్యను పెంచుకుంటాయి. ఈ బుబోనిక్ ప్లేగు వ్యాధి మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశాలు తక్కువ. ఇందులో కూడా.. నిమోనిక్ ప్లేగు అనేది అత్యంత ప్రమాదకరమైనదని.. అది ఊపిరి తిత్తులకు వ్యాపించి.. ప్రాణం తీసేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!