రాజేంద్ర నగర్లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. చింతల్ మెట్ చౌరస్తా నుంచి తన్వీర్ హుస్సేన్ అనే యువకుడిని బలవం తంగా కారులో ఎక్కించుకుని వెళ్లిన ముగ్గురు వ్యక్తులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లిం చకుండా తప్పించుకొని తిరుగుతున్న తన్వీర్ హుస్సేను ఫైనాన్షి యర్లు కిడ్నాప్ చేశారన్నారు.
తన్వీర్ హుస్సేను కిడ్నాప్ చేసిన ఖుబు రుద్దీన్, ఇబ్రహీం, మహ్మద్ రూ. 8 లక్షలు ఇవ్వాలని తన్వీర్ సోదరు డికి వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే మర్డర్ చేస్తామని బెదిరిం పులకు పాల్పడ్డారు. తన్వీర్ను ఓ గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టిన కిడ్నాపర్లు తీసుకున్న డబ్బు ను తిరిగి చెల్లించాలని తీవ్ర ఇబ్బందు లకు గురిచేశారు. దిక్కు తోచ ని స్థితిలో తన్వీర్ సోదరుడు రాజేంద్ర నగర్ పోలీసులను ఆశ్రయిం చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు లు నిందితుల ఆట కట్టించి, కిడ్నాపర్ల చెర నుండి తన్వీర్ క్షేమంగా విడిపించారు. నిందితులపై కిడ్నాప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.