Thummala Nageswara Rao: రైతన్నలను కాంగ్రెస్ సర్కార్ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది
- రైతన్నలను కాంగ్రెస్ సర్కార్ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది
- మంత్రి తమ్ముల నాగేశ్వరరావు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతుకు ఎక్కడ కష్టం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జాతీయ రహదారిపై మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు. ‘‘రుణమాఫీ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. దేశంలో ఎప్పుడూ కూడా చేయని పని.. ఒక్కసారి ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు రుణమాఫీ చేశాం. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మేము రుణమాఫీ చేశాం. ఇప్పటికే రైతు ఖాతాల్లోకి 32 వేల కోట్లు వేశాం. పంట నష్టపోయిన రైతు ఖాతాలోకి 10 వేల రూపాయలు వెళ్తున్నాయి. 10 వేల రూపాయలు వేయడం కారణంగా రైతుకు మేలు జరగడం లేదు కాబట్టి రైతుకి రైతు పంటకి బీమా మేమే కల్పిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో మేము చేసినట్లుగా రైతులకు ఏ రాష్ట్రం చేయడం లేదు. రైతులకు ఏ మేలు చేయని వారు రైతుల దగ్గర సానుభూతి పొందేందుకు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.’’ అని తుమ్మల ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Balagam Venu : ‘ఎల్లమ్మ’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
‘‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 46 మండలాల్లో 45 మండలాలకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. పాలేరు నియోజకవర్గానికి అత్యంత కరవు పీడిత ప్రాంతంగా ఉండేది. ఆ ప్రాంతానికి గత ప్రభుత్వంలో నీళ్లు అందించే అవకాశం వచ్చింది. ఇప్పుడు పాలేరుకి కూడా నీళ్లు వచ్చాయి. ఆ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. రఘునాథ పాలెం మండలానికి రెండు నదులు ఉన్నా నీళ్లు వచ్చే అవకాశం లేదు. ఖమ్మం ప్రజల దయ వల్ల నేను ఇక్కడకి వచ్చి కూర్చున్నా. హర్యాతండ వాళ్లు మంచి కూరగాయలు పండిస్తున్నారు. రఘునాథ పాలెం మండలానికి కూడా నీళ్లు అందిస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 46 మండలాలకు నీళ్లు ఇచ్చిన సంతృప్తి నాకు ఉంటుంది.’’ అని మంత్రి అన్నారు.
ఇది కూడా చదవండి: Drug Peddlers Arrest: రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ముఠా గుట్టుర
తాజావార్తలు
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!