Khammam: ఖమ్మంలో ఘరానా మోసం.. ఏటీఎం నగదు బదిలీలో ఆరితేరిన ఆ ముగ్గురు..
- ఖమ్మం జిల్లాలోని ఓ ఏటీఎంలో ఘరానా మోసం..
- ఎచ్ డి ఎఫ్ సి ఏటీఎంలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి నగదు బదిలీ..
- పోలీసుల అదుపులో మహిళ- పరారీలో మరో ఇద్దరు..
Khammam: ఖమ్మం జిల్లాలోని ఓ ఏటీఎంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఎన్ఎస్టీ రోడ్ సమీపంలోని కవిత కాలేజ్ వెడ్ ఉన్న ఎచ్ డి ఎఫ్ సి ఏటీఎంలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి గత కొంత కాలంగా నగదు బదిలీ చేయించుకుంటున్న వైనం సంచలనంగా మారింది. ఎచ్ డి ఎఫ్ సి బ్యాంక్ నిర్వాహకులకు అనుమానం రావడంతో ముంబై నుండి కాల్ చేశారు. దీంతో ఏటీఎం నిర్వాహకులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా షాక్ కి గురయ్యారు. కొందరు ఏటీఎంను ట్యాంపరింగ్ చేసి నగదు చోరీ చేస్తున్నారని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దీంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఓ మహిళ ఏటీఎం వద్ద చోరీ చేస్తూ పట్టుబడినట్లు వెల్లడించారు. అదుపులో తీసుకున్న మహిళ బీహార్ కు చెందిన ప్రియాంక సింగ్ గా గుర్తించారు. మహిళ వద్ద రెండు ఆధార్ కార్డులు, రెండు పాన్ కార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెక్కీ నిర్వహించి ఓ మహిళను పట్టుకున్నట్లు వెల్లడించారు. అయితే మరో ఇద్దరు పరారీలో వున్నట్లు తెలిపారు. ఏటీఎం నగదు చెల్లింపు విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎప్పటి నుంచి నగదు బదిలీ చేస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.
Bandi Sanjay: భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
Also Read
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
- Telangana : పదేళ్ల తర్వాత మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో