Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
- పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
- రూ.10 లక్షలకు రూ.40 లక్షలు అంటూ మోసం
- యూనిఫామ్, హ్యాండ్కఫ్లతో నకిలీ దాడులు
- 12 మంది అరెస్ట్.. రూ.17.6 లక్షలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam Police : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారంలో జరిగిన సంచలన డెకాయిటీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆధ్వర్యంలోని సత్తుపల్లి పోలీస్ ప్రత్యేక బృందాలు ఈ కేసులో ముమ్మర దర్యాప్తు జరిపి మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఈ దోపిడీ ముఠాలో భాగస్వాములు కావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అరెస్టైన వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించగా, ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
సంచలనం రేపిన అసలు పోలీసుల నిర్వాకం
ఈ దోపిడీ ముఠాలో టీజీఎస్పీ 15వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ ముళ్ళగిరి వర్దన్, అలాగే ఆర్ఎస్ఐ ఋశీ బేరా కేశవరావు ప్రధాన సూత్రధారులుగా ఉండటం గమనార్హం. యూనిఫామ్ వేసుకుని రక్షణగా నిలవాల్సిన వీరు నేరస్తులతో చేతులు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తామంటూ ఈ ముఠా అమాయకులను వలలో వేసుకునేది. కేవలం రూ. 10 లక్షలు ఇస్తే దానికి బదులుగా రూ. 40 లక్షలు ఇస్తామంటూ బాధితులకు పెద్ద ఎత్తున ఆశ చూపించి బురిడీ కొట్టించేవారు.
Also Read
- Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల!
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
పోలీస్ యూనిఫాంలో పక్కా ప్లాన్ ప్రకారం దాడి
నగదు మార్పిడి ఆశతో బాధితులు తమ వద్ద ఉన్న అసలు సొమ్ముతో ఒక ప్రాంతానికి రాగానే ఈ ముఠా పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగేది. నిందితుల్లో కొందరు పోలీస్ యూనిఫాంలు, పోలీస్ టీషర్టులు, రైన్కోట్లు ధరించి, చేతిలో హ్యాండ్కఫ్లతో వచ్చి నకిలీ పోలీసుల తరహాలో బాధితులపై దాడి చేసేవారు. చట్టపరమైన చర్యలు ఉంటాయంటూ తీవ్రంగా బెదిరింపులకు గురిచేసి, బాధితుల వద్ద ఉన్న అసలు నగదును దోచుకుని తమ వాహనాల్లో పరారయ్యేవారు. నమ్మకం కలిగించడం కోసం వీరు పిల్లలు ఆడుకునే డమ్మీ 500 రూపాయల కరెన్సీ నోట్లను బండిళ్లుగా కట్టి వాడుకునేవారు.
భారీగా సొత్తు స్వాధీనం – ముమ్మర దర్యాప్తు
సత్తుపల్లి ప్రత్యేక బృందాలు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో రూ. 17.60 లక్షల అసలు నగదుతో పాటు నేరానికి ఉపయోగించిన రెండు ఇన్నోవా కార్లు, ఒక ఎర్టిగా కారు, ఒక టీవీఎస్ యాక్సెస్ స్కూటీని సీజ్ చేశారు. వీటితో పాటు 16 సెల్ఫోన్లు, దోపిడీకి వాడిన పోలీస్ యూనిఫాంలు, హ్యాండ్కఫ్లు, రైన్కోట్లు , రూ. 500 డమ్మీ కరెన్సీ నోట్లకు సంబంధించిన 80 బండిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంగారం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశామని, పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.
తాజావార్తలు
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!