Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
- సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు
- హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ సవాల్
- రేపు విచారించనున్న సుప్రీం ధర్మాసనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు మరోసారి సంచలనంగా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీకి మేఘాలయ హైకోర్టు బెయిల్ మంజూర్ చేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించింది. బెయిల్ మంజూరు చేస్తూ మేఘాలయ హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ఈ పిటిషన్పై గురువారం జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ శీల్ నాగులతో కూడిన ధర్మాసనం ముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తప్పిదమని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. అరెస్టు సమయంలో సోనమ్కు అరెస్టుకు సంబంధించిన పూర్తి కారణాలను అందించలేదనే కారణంతోనే బెయిల్ మంజూరైందని తుషార్ మెహతా తెలిపారు. అయితే పత్రాల్లో ఒక నిబంధనను ప్రస్తావించే సమయంలో టైపోగ్రాఫికల్ పొరపాటు మాత్రమే జరిగిందని.. అది చట్టపరంగా పెద్ద లోపం కాదని వాదించారు. అంతేకాకుండా బెయిల్పై విడుదలైతే నిందితురాలు పరారయ్యే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం శుక్రవారం విచారణకు కేసును జాబితాలో చేర్చేందుకు అంగీకరించింది.
ఇదిలా ఉండగా జూన్ 29న మేఘాలయ హైకోర్టు… ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సమర్థిస్తూ సోనమ్ రఘువంశీకి బెయిల్ మంజూరు చేసింది. గతేడాది మే 23న హనీమూన్ కోసం మేఘాలయలోని సోహ్రా ప్రాంతానికి వెళ్లిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ అదృశ్యమయ్యారు. అనంతరం 2025 జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం లోతైన లోయలో లభ్యమైంది. ప్రియుడి కోసం హంతకులతో కలిసి భర్త హత్యకు సోనమ్ రఘువంశీ కుట్ర పన్నినట్లు పోలీసులు ఆరోపించారు. మరోవైపు సోనమ్ బెయిల్ మంజూరు చేయడంపై బాధిత కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. భర్తను చంపిన వ్యక్తికి ఎలా మంజూరు చేస్తారని న్యాయస్థానాలను ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!