Minister Komatireddy: కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. హరీష్ రావు, కేటీఆర్ లెక్కలోకి రారు..
- కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. కేసీఆర్ వస్తే అన్ని అంశాలపై చర్చ జరుపుతాం..
- హరీష్రావు, కేటీఆర్తో మాకు సంబంధం లేదు.. వాళ్లు లెక్కలోకి రారు..
- తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. హరీష్ రావు ఉత్తి ఎమ్మెల్యే.. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదు..
- అసెంబ్లీకి ప్రతిపక్ష నేత వచ్చి మా తప్పు ఒప్పులు చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Komatireddy: తెలంగాణలోని ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. 3 గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. ట్రాఫిక్ ఇబ్బంది ఉన్న రోడ్లకు మొదటి ప్రియార్టీ.. హ్యామ్ మోడల్ లో రోడ్ల నిర్మాణం జరపాలని నిర్ణయించాం.. మా ప్రభుత్వం వచ్చాక రూ. 6500 కోట్లతో రూరల్ రోడ్స్ టెండర్లు పిలిచాం.. రోడ్ల నిర్మాణం జరుగుతుంది అన్నారు. పెండింగ్ రోడ్స్ పూర్తి చేయాలని నిర్ణయించాం.. తెలంగాణలో మా శాఖ రోల్ మోడల్ గా ఉండేలా చర్యలు చేపట్టామని తేల్చి చెప్పారు. రోడ్లు మా కోసం, కాంట్రాక్టర్ల కోసం కాదు ప్రజల కోసం అన్నారు. దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ గా ఉండేలా రోడ్ల నిర్మాణం చేపడుతాం.. రూరల్ రోడ్లన్ని రానున్న మూడేళ్లలో పూర్తి చేస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు.
Read Also: Ariyana : తొమ్మిదో క్లాస్ లోనే అతన్ని లవ్ చేశా.. అరియానా బ్రేకప్ స్టోరీ..
Also Read
ఇక, కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. ఆయన వస్తే అన్ని అంశాలపై చర్చ జరుపుతాం.. హరీష్ రావు, కేటీఆర్ తో మాకు సంబంధం లేదని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కేసీఆర్, మేము ఉద్యమంలో పని చేశామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇక, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. హరీష్ రావు ఉత్తి ఎమ్మెల్యే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదు.. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత వచ్చి మా తప్పు ఒప్పులను చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సలహాలు ఇస్తే స్వీకరిస్తాం.. తప్పులను చూపిస్తే సరిదిద్దుకుంటాం అన్నారు. కేసీఆర్ తోనే లెక్క.. హరీష్ రావు ఎవరో నాకు తెలీయదని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావు, కేటీఆర్ లు కీలకం.. వాళ్లే ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నారు. కేసీఆర్ చుట్టూ ఉంటూ.. ఆయనకు చెప్పే ఫోన్ ట్యాపింగ్ చేశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు.
Read Also: Formula E Scam Case: ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్.. మంత్రి ఆదేశాలతో నిధులు విడుదల
అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయిన కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్స్ చెల్లిస్తున్నామని మంత్రి వెంకటరెడ్డి చెప్పారు. ఇక, రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ప్రధానిని, గడ్కారీని త్వరలో కలుస్తామన్నారు. 6 లైన్ల రోడ్డు కోసం త్వరలో క్యాబినెట్ అమోదం లభిస్తుంది.. టెండర్ ప్రక్రియ వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.. ఓఆర్ఆర్ నిర్మాణం రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తి అయింది.. ఆర్ఆర్ఆర్ తో హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయని అన్నారు. మూడేండ్లలో రిజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తాం.. హ్యామ్ రోడ్స్ పై ముఖ్యమంత్రి సలహా తీసుకొని త్వరలో టెండర్స్ పిలుస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!