KCR : ఎర్రవల్లి ఫామ్హౌస్లో చండీ యాగం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ యాగాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా నిర్వహించనున్నారు. ఈరోజు యాగం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ చండీ యాగం మూడు రోజుల పాటు కొనసాగనుంది. రేపటి నుంచి అధికారికంగా యాగం ప్రారంభమవుతుంది.
Pulaparthi Nani: లిక్కర్ స్కామ్పై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు
ఒకవైపు యాగం ఏర్పాట్లు జరుగుతుండగానే, ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపైనే ప్రధానంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. యాగంతో పాటు రాజకీయపరమైన కీలక చర్చలు కూడా ఫామ్హౌస్లో కొనసాగుతున్నాయి.
AI Girls: బూతులు మాట్లాడే అందమైన భామలు.. కామెడీ పేరుతో కామకథలు!