KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం ఎర్రవెల్లి ఫాంహౌస్లో నిర్వహించిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సుమారు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ , ముఖ్యంగా సభ్యత్వ నమోదు ప్రక్రియపై కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ వంటి ప్రక్రియలను పూర్తిగా డిజిటల్ విధానంలోనే నిర్వహిస్తున్న తరుణంలో, పార్టీ సభ్యత్వాన్ని కూడా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డిజిటలైజేషన్ పద్ధతిలోనే చేపట్టాలని ఈ సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది.
ఈ సరికొత్త డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు ఒక పటిష్టమైన కార్యాచరణను సిద్ధం చేశారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,655 పోలింగ్ బూత్లలో ప్రతి బూత్కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మందికి డిజిటల్ మెంబర్షిప్ విధివిధానాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుండి ఒక సభ్యత్వ సమన్వయ కర్తను నియమించడంతో పాటు, వచ్చే రెండు మూడు రోజుల్లోనే మండలాలు , మున్సిపల్ బాడీల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ శిక్షణా శిబిరాలన్నీ పార్టీ ప్రధాన కార్యదర్శుల ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగనున్నాయి.
Also Read
- Harish Rao : 'కరెంట్ ఉంటేనే వార్త'.. హరీష్ ఫైర్.!
- Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
సభ్యత్వ నమోదు ప్రక్రియను జిల్లాల వారీగా సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు కేసీఆర్ సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు తక్కళ్లపల్లి రవీందర్ రావును, కరీంనగర్ క్లస్టర్కు జీవన్ రెడ్డిని, వరంగల్ ప్రాంతానికి పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇంచార్జీలుగా నియమించారు. అదేవిధంగా ఉమ్మడి మెదక్ బాధ్యతలను గ్యాదరి బాలమల్లుకు, నిజామాబాద్ జిల్లాను గంగాధర్ గౌడ్కు, అదిలాబాద్ ప్రాంతాన్ని రావుల శ్రావణ్ కుమార్ రెడ్డికి కేటాయించారు. రంగారెడ్డి జిల్లాకు సబితా ఇంద్రారెడ్డి, హైదరాబాద్కు తలసాని శ్రీనివాస్ యాదవ్, నల్గొండ జిల్లాకు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పర్యవేక్షకులుగా వ్యవహరించనున్నారు. ఈ భారీ కసరత్తు ద్వారా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
-
UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
-
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
-
Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
-
Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!