KC Venugopal: రేవంత్ ఈ విషయంలో ఎందుకు వెనుకపడ్డావు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పబ్లిసిటీ చెయ్యడంలో ముందుంటావు… కానీ, భారత్ జోడో యాత్రలో ఎందుకు వెనుక పడ్డావు అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్. భారత్ జోడో యాత్రపై గాంధీభవన్లో జరిగిన సమీక్షలో ఈ కామెంట్స్ చేశారు కేసీ వేణుగోపాల్. జోడో ప్రచారంలో తెలంగాణ పీసీసీ వెనుకబడిందని కామెంట్ చేశారు. మరోవైపు.. రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసే వరకు తెలంగాణ విడిచిపోవద్దని, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ను ఆదేశించారు. తమకున్న నివేదిక ప్రకారం వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్న వేణుగోపాల్, భారత్ జోడో యాత్రను పాదయాత్రలా కాకుండా ఉద్యమంలా చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీతో సాయంత్రం జరిగే పాదయాత్రలో 50 వేలమందికి తక్కువ ఉండకుండా చూడాలని చెప్పారు. భారత్ జోడోకు విస్తృతమైన ప్రచారం చెయ్యాలన్నారు. రేపటి నుంచే గ్రామస్థాయికి వెళ్లేలా ప్రచారాన్ని మొదలుపెట్టాలని చెప్పారు కేసీ వేణుగోపాల్.
Read Also: Minister Seediri Appalaraju: పాదయాత్ర ఆపేయాలని అడుగుతాం.. ఆపకపోతే అడ్డుకుంటాం
Also Read
- Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
- Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
ఇక, పాదయాత్రలో రాహుల్ గాంధీని కలిసేందుకు నాయకులు ఎవరూ ప్రయత్నం చేయొద్దు అని స్పష్టం చేశారు కేసీ వేణుగోపాల్.. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసేవాళ్లను, ఉద్యమకారులను, సమస్యలతో బాధపడుతున్న వాళ్లను రాహుల్ గాంధీని కలిసేలా ప్లాన్ చేసుకోండి అని సూచించారు.. కాగా, కర్నాటక చిత్రదుర్గలో 36వ రోజు రాహుల్ జోడోయాత్ర కొనసాగుతోంది. ఇందులో పార్టీ నేతలు డీకే శివకుమార్తో పాటు స్థానిక నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడక్కడ ఆగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నడక సాగిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 930 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేసుకున్నారు రాహుల్. ఉదయం బొమ్మనగండన హళ్లి నుంచి ప్రారంభమైన జోడో యాత్ర.. సాయంత్రం రాంపురాలో ముగిసింది. ఉదయం అక్కడి నుంచే మళ్లీ యాత్ర ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
-
Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సిక్స్లు, ఫోర్లు కొడితే సరిపోతుందా..? ‘అతడిని తప్పించండి’..
-
PM Modi: ఆందోళన వద్దు.. ధైర్యంగా ఉండండి.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు మోడీ భరోసా
-
Supreme Court: ‘గుడ్లకు భయమెందుకు?’.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
-
CM Vijay : విజయ్కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!