Kavitha: ప్రస్తుత పాలకులకు అమ్మతనం లేదు.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు
- తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు
- ప్రస్తుత పాలకులకు అమ్మతనం లేదు
- జాగృతి NGOగా కొనసాగుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తెలంగాణ ప్రజల ముందుకు ఒక కొత్త రాజకీయ వేదికతో వచ్చారు. ప్రజల సమస్యలను ఎత్తి చూపే ప్రశ్నించే గొంతుకగా తన పార్టీ పని చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. పాలక పక్షం, ప్రతిపక్షం తేడా చూడకుండా అన్ని అంశాలపై మాట్లాడతామని ప్రకటించారు. జాగృతి NGOగా కొనసాగుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు ఎదురైనా తాను చెప్పిన మాట మీద, పట్టిన తోవ మీద నిలబడతానని కవిత అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందడుగు వేయాలని కవిత సూచించారు. “ధాన్యం కొనండి. రైస్ ఎగుమతి చేసే పరిస్థితి ఉంది. కార్పొరేషన్ పెట్టి ఎగుమతి చేయండి. రైస్ లైసెన్స్ తీసుకోండి” అని ప్రభుత్వానికి సూచించారు.
ప్రస్తుత పాలకులకు “అమ్మతనం” లేదని, అందుకే పరిపాలన సరిగా జరుగడం లేదని విమర్శించారు. “అమ్మగా నేను ఉంటా” అని చెప్పినందుకు కొందరు అవాకులు చెవాకులు పేలుస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. సర్వోదయ తెలంగాణ సాధనే తన లక్ష్యమని చెప్పిన కవిత, 60 వేలకు పైగా భూ నిర్వాసితుల పక్షాన నిలబడతానని ప్రకటించారు. గురుకులాల్లో పిల్లలు పిట్టల్లా చనిపోతున్న విషయంపై మండిపడ్డారు. విద్యాశాఖ సీఎం దగ్గరే ఉన్నా, సమీక్షలు కూడా చేయడం లేదని విమర్శించారు. వచ్చే రెండున్నరేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం పై కోట్లాడతానని హెచ్చరించారు.
Also Read
- Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
- Nepal Gorkhas: "మేము భారత సైన్యంలో చేరుతాం".. నేపాల్లో రోడ్డెక్కిన యువత
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
గ్రూప్-1లో అవినీతి జరిగిందంటే బుల్డోజ్ చేసి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. “ఫ్యూచర్ సిటీ కాదు… ఫ్యూచర్ లెస్ సిటీ. అదో రియల్ ఎస్టేట్ మాయ” అని వ్యాఖ్యానించారు. మహిళలపై అత్యాచారాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పెరిగాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం సెక్రటేరియట్కు రావడం లేదని, వాస్తు సమస్య ఉండవచ్చని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో మంత్రుల ఇండ్లకు వెళ్లడం లేదన్నారు. BRSలో ఉన్నప్పుడు అనేక అవినీతి, అక్రమాలపై ఆధారాలు కేసీఆర్కు ఇచ్చానని, అప్పుడు ఆయన బాస్ కాబట్టి చెప్పిన పని చేశానని కవిత చెప్పారు. తల్లిదండ్రులను గౌరవిస్తానని, BRS అధ్యక్షుడిగా మాత్రమే కేసీఆర్ను విమర్శిస్తానని స్పష్టం చేశారు.
పది సార్లు పేపర్ లీకులు జరగడంపై కేటీఆర్ను ప్రశ్నించారు. “విదేశాలు తిరిగే కేటీఆర్ పరీక్ష పత్రాలు లీక్ కాకుండా టెక్నాలజీ వాడలేరా?” అని నిలదీశారు. తెలంగాణ రక్షణ సేనను ఎన్నికల కమిషన్ గుర్తించినా, ఆ పేరు రానివ్వకుండా కుట్రలు జరిగాయని ఆమె ఆరోపించారు. ఆ కుట్రల నుంచి బయటపడటానికి కొన్ని టెక్నిక్స్ వాడాల్సి వచ్చిందని వెల్లడించారు. బీజేపీకి తెలంగాణలో స్పేస్ లేదని, ధర్మపురి అరవింద్ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్లో చాలా మంది చాలా మాట్లాడతారని, కానీ రాజకీయ పార్టీగా ఉండటమే పవర్ అని, తన పవర్ ఏమిటో కాలమే సమాధానం చెప్తుందని చెప్పారు. తన టార్గెట్ BRS కాదు, కాంగ్రెస్ కాదని, సర్వోదయ తెలంగాణకు అడ్డువచ్చే వారిని విమర్శిస్తానని కవిత స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
విరాట్ కోహ్లీ వాడే ‘హూప్’ కి పోటీగా Google Fitbit Air.. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..
-
Realme P4s Lite: రియల్మీ P4s లైట్.. 7000mAh బ్యాటరీతో చౌకైన ఫోన్.. ఫీచర్లు అదిరిపోయేలా!
-
Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
-
India – Pakistan: మొదట భారత్ తరఫున ఆడి.. ఆ తర్వాత పాకిస్థాన్ తరఫున ఆడిన క్రికెటర్లు వీరే..!
-
Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!