ఈ ఎన్నికల తరువాత జరిగేది అదే : ఈటల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారాల్లో వేగం, వేడి పెరుగుతోంది. మంగళవారం హుజురాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ లో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద పెద్ద స్కీంలకు ఇందిరానగర్- శాలపల్లి కేంద్రంగా మారిందన్నారు. శాలపల్లిలో దళితబంధు ఆరంభించి 65-66 రోజులైందని, ఈ స్కీం మొదటి ఇక్కడే లాంఛ్ చేయలేదని, భువనగిరి జిల్లా వాసాలమర్రిలో ప్రారంభించారని గుర్తు చేశారు. దళితబంధు నేను వద్దన్నట్లు దొంగ ఉత్తరం కేసీఆర్ సృష్టించాడని, నేను లెటర్ రాస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించినట్లు తెలిపారు. దళితబంధుపై దొంగ ఉత్తరాలు సృష్టించి ఆపే ప్రయత్నం చేయవద్దని కోరానన్నారు. కానీ రాత్రి మళ్లీ కొత్త నాటకానికి తెరలేపాడు. నీవు తలకిందకు పెట్టి, కాళ్లు పైకి పెట్టి జపం చేసినా నీకు ఓట్లు వేయరని చెప్పాను. ఎన్నడూ లేని భయం ప్రజలో ఆవరించింది. నీవల్ల పేదరికం పెరిగిందని, అశాంతి ప్రభలుతోందని ప్రజలు భావిస్తున్నారన్నారు.
హుజురాబాద్ లో కేసీఆర్ పార్టీ ఓడిపోయిన తర్వాత.. తెలంగాణ మొత్తంలోనూ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. నేను శపించడానికి ఋషిని కాకపోవచ్చు. నేను పూజలు చేసే పూజారిని కాకపోవచ్చు. కానీ ప్రజలంతా కేసీఆర్ చెప్పే మాటలకు, చేతలకు పొంతనలేదని అంటున్నారన్నారు. మాటలు చెప్పి, భయభ్రాంతులకు గురిచేసి పాలన సాగిస్తున్నాడు. పాలనలో అంతా డొల్లతనమే. ఆర్థికంగా రాష్ట్రం కుప్పకూలి పేదరికం పెరిగిపోయింది. ఉద్యోగాల వస్తాయని 1200 మంది అమరులైతే.. ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. తల్లిదండ్రులు పిల్లలకు ఉద్యోగాలు వస్తే మురిసిపోవాల్సిన సమయంలో కూలీ పని చేసి పిల్లలకు పెడుతున్నారన్నారు.
Also Read
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
ఎన్నికలప్పుడే నోటిఫికేషన్లు గుర్తొస్తాయి. ఎన్నికలప్పుడే దళితులు గుర్తుకు వస్తారు. సీఆర్ ప్రజలు మెచ్చే పద్ధతిలో పనిచేయడం లేదు. ఊర్లకు బార్లుగా మార్చారు. నాయకులను వెలగొట్టి కొంటున్నారు. ఓటుకు 20 వేలు, 30 వేలతో బేరం చేస్తున్నారు. కొప్పుల ఈశ్వర్, సుమన్ లాంటి వాళ్లు.. నీచంగా మాట్లాడుతున్నారు. నాకు నేనే దాడి చేయించుకుని సానుభూతి కోసం ఓట్లు అడుక్కుంటానని ప్రచారం చేస్తున్నారని అన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!