Karimnagar Mayor: అధికారులను బెదిరించే ధోరణిని పొన్నం మానుకోవాలి..
- అధికారులను బెదిరించే ధోరణిని పొన్నం మానుకోవాలి..
- పొన్నం ప్రభాకర్ పై కీలక వ్యాఖ్యలు..
- పొన్నం ఏ హోదాలో సమీక్ష చేశారు? అని ఆగ్రహం..
- పొన్నం కరీంనగర్ నగరానికి ఏమి చేసాడో చెప్పాలని సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar Mayor: అధికారులను బెదిరించే ధోరణిని పొన్నం మానుకోవాలని కరీంనగర్ మేయర్ సునీల్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. బండి సంజయ్ ఎంపీగా కరీంనగర్ కార్పోరేషన్ అభివృద్ధికి చాలా సహకారం అందించారు. కేంద్రం నుంచి నిధులు విడుదల చేయడం విషయంలో సంజయ్ ఎంపీగా చాలా కృషి చేసారు. నగర అభివృద్ధిలో బండి సంజయ్ పాత్ర చాలా కీలకమైందన్నారు. స్మార్ట్ సిటీ నిధుల మంజూరులో ఆయన సహకారం మరువలేనిదన్నారు. కరీంనగర్ జిల్లాకు సంబంధం లేని మంత్రి నిన్న సమీక్ష చేశారన్నారు. కరీంనగర్ నుంచి ఓటు హక్కుతో సహా ట్రాన్స్ఫర్ చేసుకున్న పొన్నం ప్రభాకర్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ సమీక్ష కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం లాగా సాగిందన్నారు. కరీంనగర్ కార్పోరేషన్ లో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారన్నారు.
Read also: Pawan Kalyan: మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం.. కోన వెంకట్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
మేయర్ కి, ఎమ్మెల్యేలకి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఆహ్వానం లేకుండా సమీక్ష ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. అధికారులు జాగ్రత్తగా పని చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులను పిలవకుండా ఎలా సమీక్ష నిర్వహించారని మండిపడ్డారు. పొన్నం హుస్నాబాద్ కి ఎమ్మెల్యే కరీంనగర్ కి కాదన్నారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండగా పొన్నం ఏ హోదాలో సమీక్ష చేశారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని మేము స్వాగతిస్తాం… వచ్చి సమీక్షలు చేయండి.. సహకరిస్తామన్నారు. కరీంనగర్ అభివృద్ధి చేసింది మేమన్నారు. పొన్నం కరీంనగర్ నగరానికి ఏమి చేసాడో చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ లో రోడ్లు లేవు పదేళ్ళలో అద్భుతమైన రోడ్లు వేశామన్నారు. ప్రజలకు ప్రతీ రోజూ నీళ్లు ఇచ్చాం.. కాంగ్రెస్ వచ్చాక రెండ్రోజులకు ఒక్కసారి కూడా రావడం లేదన్నారు. తనను ఓడించారని కరీంనగర్ నగర ప్రజలపై పొన్నం కసి పెంచుకున్నారని తెలిపారు. అధికారులను బెదిరించే ధోరణిని పొన్నం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sonakshi Sinha Marriage: 20న హల్దీ వేడుక.. 23న పెళ్లి!
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!