Karimnagar Mayor: అధికారులను బెదిరించే ధోరణిని పొన్నం మానుకోవాలి..
- అధికారులను బెదిరించే ధోరణిని పొన్నం మానుకోవాలి..
- పొన్నం ప్రభాకర్ పై కీలక వ్యాఖ్యలు..
- పొన్నం ఏ హోదాలో సమీక్ష చేశారు? అని ఆగ్రహం..
- పొన్నం కరీంనగర్ నగరానికి ఏమి చేసాడో చెప్పాలని సవాల్..
Karimnagar Mayor: అధికారులను బెదిరించే ధోరణిని పొన్నం మానుకోవాలని కరీంనగర్ మేయర్ సునీల్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. బండి సంజయ్ ఎంపీగా కరీంనగర్ కార్పోరేషన్ అభివృద్ధికి చాలా సహకారం అందించారు. కేంద్రం నుంచి నిధులు విడుదల చేయడం విషయంలో సంజయ్ ఎంపీగా చాలా కృషి చేసారు. నగర అభివృద్ధిలో బండి సంజయ్ పాత్ర చాలా కీలకమైందన్నారు. స్మార్ట్ సిటీ నిధుల మంజూరులో ఆయన సహకారం మరువలేనిదన్నారు. కరీంనగర్ జిల్లాకు సంబంధం లేని మంత్రి నిన్న సమీక్ష చేశారన్నారు. కరీంనగర్ నుంచి ఓటు హక్కుతో సహా ట్రాన్స్ఫర్ చేసుకున్న పొన్నం ప్రభాకర్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ సమీక్ష కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం లాగా సాగిందన్నారు. కరీంనగర్ కార్పోరేషన్ లో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారన్నారు.
Read also: Pawan Kalyan: మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం.. కోన వెంకట్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
మేయర్ కి, ఎమ్మెల్యేలకి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఆహ్వానం లేకుండా సమీక్ష ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. అధికారులు జాగ్రత్తగా పని చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులను పిలవకుండా ఎలా సమీక్ష నిర్వహించారని మండిపడ్డారు. పొన్నం హుస్నాబాద్ కి ఎమ్మెల్యే కరీంనగర్ కి కాదన్నారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండగా పొన్నం ఏ హోదాలో సమీక్ష చేశారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని మేము స్వాగతిస్తాం… వచ్చి సమీక్షలు చేయండి.. సహకరిస్తామన్నారు. కరీంనగర్ అభివృద్ధి చేసింది మేమన్నారు. పొన్నం కరీంనగర్ నగరానికి ఏమి చేసాడో చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ లో రోడ్లు లేవు పదేళ్ళలో అద్భుతమైన రోడ్లు వేశామన్నారు. ప్రజలకు ప్రతీ రోజూ నీళ్లు ఇచ్చాం.. కాంగ్రెస్ వచ్చాక రెండ్రోజులకు ఒక్కసారి కూడా రావడం లేదన్నారు. తనను ఓడించారని కరీంనగర్ నగర ప్రజలపై పొన్నం కసి పెంచుకున్నారని తెలిపారు. అధికారులను బెదిరించే ధోరణిని పొన్నం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sonakshi Sinha Marriage: 20న హల్దీ వేడుక.. 23న పెళ్లి!
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!