Kalvakuntla Kavitha: నిర్మలా సీతారామన్కు కవిత కౌంటర్.. వికాస్ అంటే ఇదేనా?
Kalvakuntla Kavitha: సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. రూ.100 లక్షల కోట్ల అప్పు చేసిన మోడీ ప్రభుత్వం.. తెలంగాణ రుణాలపై మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. 2014 నాటికి రూ.55 లక్షల కోట్ల అప్పు ఉంటే.. ఇప్పుడు అది దాదాపు రూ. 155 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. ఈ లెక్కన.. మోడీ ప్రభుత్వం రూ. 100 లక్షల కోట్ల అప్పు చేసిందని వివరణ ఇచ్చారు. కాబట్టి.. అప్పుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన దానికి, కేంద్ర ప్రభుత్వం చేసిన దానికి పొంతన లేదని చెప్పారు. ఈ దేశంలో ఒక్కో వ్యక్తిపై 3 రేట్ల అధిక అప్పును మోడీ మోపారని మండిపడ్డారు. అత్యంత ధనవంతులు 3 శాతం మాత్రమే జీడీపీకి తోడ్పడుతున్నారని, మిగితా మొత్తం పేద సామన్య వ్యక్తులదేనని చెప్పారు.
Tax Survey on BBC: బీబీసీ ఐటీ రైడ్స్పై పాక్ జర్నలిస్ట్ ప్రశ్న.. అమెరికా ఇచ్చిన సమాధానం ఇదే..
Also Read
8.5 కోట్ల మందికి జాబ్ కార్డులు ఉన్నాయని, వారికి ఉపాధి కల్పించే బాధ్యత కేంద్రానికి ఉందని అన్నారు. కానీ.. వాళ్లకు ఉపాధి కల్పించకపోగా, చేయాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చు చేశామని నిర్మలా అంటున్నారని అన్నారు. లేనిపోని సాకుల చెప్పి.. ఉపాధి హామీ కార్మికుల జాబ్ కార్డులను తగ్గించి, పేదల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పెద్దవాళ్లకు దోచిపెట్టే కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. కొత్త రాష్ట్రానికి ప్రత్యేక అవసరాలు ఉంటాయని, కాబట్టి దయచేసి అన్ని రకాలుగా ఆదుకోవాలని సీఎం కేసీఆర్ కోరారని గుర్తు చేశారు. అయినా కేంద్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ఏర్పాటులోనూ వివక్ష చూపించిందని ఫైర్ అయ్యారు. కొత్త జిల్లాల్లో నవోదయ పాఠశాలలు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినా.. కేంద్రం ఇవ్వడం లేదన్నారు. తలసరి ఆదాయాన్ని ఆర్థిక సర్వేలో వెల్లడించకపోవడం దారుణమని పేర్కొన్నారు. జనగణన ఇంకా చేయలేదని, దేశ ప్రజల వివరాలే కేంద్రం వద్ద లేవని తెలిపారు. కర్ణాటక మెట్రోతో పాటు ఉత్తరప్రదేశ్లో చిన్న చిన్న పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులను ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటే ఇదేనా? అని కవిత నిలదీశారు.
Nirmala Sitaraman: కేసీఆర్పై నిర్మలా ఫైర్.. జోకులు వద్దంటూ వార్నింగ్
కాగా.. 2014లో తెలంగాణకు రూ. 60 వేల కోట్ల అప్పు ఉంటే, ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు చేరిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయం తెలిసిందే! భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్లకు చేరాలన్న లక్ష్యంపై జోక్లు వేయొద్దని సీరియస్ అయ్యారు కూడా! తమపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని, నెంబర్లు చూసి విమర్శలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్కి తెలియదని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీలు లేని జిల్లాల పేర్లు అడిగినప్పుడు వాళ్లు ఇవ్వలేదని, ఇప్పుడు బాధపడితే ఏం లాభమని నిర్మలా పేర్కొన్నారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నప్పటికీ.. మెడికల్ కాలేజీల కోసం అవే జిల్లాల పేర్లు మళ్లీ పంపించారని, అందుకే తిరస్కరించి పంపించానన్నారు. ఇందుకు కౌంటర్గానే కవిత పై విధంగా స్పందించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!