MP K.Laxman : మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఆర్ఎస్ కూలింది
- 22 నెలల ఆలస్యం ఎందుకు?.. సీఎం రేవంత్పై లక్ష్మణ్ ప్రశ్నలు
- కాగ్, విజిలెన్స్ నివేదికల్లో స్పష్టమైన అవినీతి వివరాలు
- హరీష్, సంతోష్ అవినీతి ఆనకొండలు.. కవిత ఆరోపణలు
- అమరుల త్యాగాలను కేసీఆర్ కుటుంబం క్యాష్ చేసుకుంది :బీజేపీ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP K.Laxman : బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ కాళేశ్వరం అవినీతి కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బిఆర్ఎస్ కూలింది. కాళేశ్వరం మూడు పిల్లర్లు కూలిపోతే, బిఆర్ఎస్ మూడు ముక్కలైంది” అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే, ఈ నిర్ణయం తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి 22 నెలలు ఎందుకు ఆలస్యం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆధారాలు ఉన్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఆ ఆధారాలను సీబీఐకి సమర్పించి దర్యాప్తుకు సహకరించాలని లక్ష్మణ్ సూచించారు.
Delhi: ఢిల్లిలో అక్రమ ఆయుధాల కర్మాగారం.. పట్టుకున్న పోలీసులు..
Also Read
- Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Komatireddy Venkat Reddy : నేను ప్రచారానికి రాకపోయినా గెలిపించాలి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
- CM Revanth Reddy : సికింద్రాబాద్ లష్కర్ బోనాల్లో ఆధ్యాత్మిక శోభ
- Bhatti Vikramarka: తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం.. మా టార్గెట్ ఇదే
సీబీఐ విచారణలో ఎవరైనా ఉన్నా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. “కాగ్ నివేదిక, విజిలెన్స్ రిపోర్టులు అన్నీ అవినీతి స్పష్టంగా చూపిస్తున్నాయి. అయితే ఘోష్ కమిటీ రాజకీయ, అధికారుల, కాంట్రాక్టర్ల పాత్రను తేల్చలేకపోయింది. కవితే స్వయంగా హరీష్ రావు, సంతోష్ అవినీతికి పాల్పడ్డారని చెప్పింది. వారిని ‘ఆనకొండలు’గా సంబోధించింది. అలా అయితే కేసీఆర్ కూడా అవినీతిలో భాగస్వామే కాదా?” అని ప్రశ్నించారు. “రాష్ట్రం కోసం వేలాది మంది యువత, ఉద్యోగులు, ప్రజలు పోరాటం చేశారు. అమరుల త్యాగాలను కేసీఆర్ కుటుంబం క్యాష్ చేసుకుంది. తెలంగాణ ఆస్తులను బిఆర్ఎస్ కొల్లగొట్టింది. అవినీతి పరులకు బీజేపీలో స్థానం లేదు. కఠినంగా శిక్షించాలి” అని లక్ష్మణ్ అన్నారు.
పావురాల గుట్టలో ఆ రోజు నిజంగా ఏం జరిగింది..? వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం నిజాలు
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!