MP K.Laxman : మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఆర్ఎస్ కూలింది
- 22 నెలల ఆలస్యం ఎందుకు?.. సీఎం రేవంత్పై లక్ష్మణ్ ప్రశ్నలు
- కాగ్, విజిలెన్స్ నివేదికల్లో స్పష్టమైన అవినీతి వివరాలు
- హరీష్, సంతోష్ అవినీతి ఆనకొండలు.. కవిత ఆరోపణలు
- అమరుల త్యాగాలను కేసీఆర్ కుటుంబం క్యాష్ చేసుకుంది :బీజేపీ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP K.Laxman : బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ కాళేశ్వరం అవినీతి కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బిఆర్ఎస్ కూలింది. కాళేశ్వరం మూడు పిల్లర్లు కూలిపోతే, బిఆర్ఎస్ మూడు ముక్కలైంది” అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే, ఈ నిర్ణయం తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి 22 నెలలు ఎందుకు ఆలస్యం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆధారాలు ఉన్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఆ ఆధారాలను సీబీఐకి సమర్పించి దర్యాప్తుకు సహకరించాలని లక్ష్మణ్ సూచించారు.
Delhi: ఢిల్లిలో అక్రమ ఆయుధాల కర్మాగారం.. పట్టుకున్న పోలీసులు..
Also Read
- 1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
- Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
- Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
సీబీఐ విచారణలో ఎవరైనా ఉన్నా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. “కాగ్ నివేదిక, విజిలెన్స్ రిపోర్టులు అన్నీ అవినీతి స్పష్టంగా చూపిస్తున్నాయి. అయితే ఘోష్ కమిటీ రాజకీయ, అధికారుల, కాంట్రాక్టర్ల పాత్రను తేల్చలేకపోయింది. కవితే స్వయంగా హరీష్ రావు, సంతోష్ అవినీతికి పాల్పడ్డారని చెప్పింది. వారిని ‘ఆనకొండలు’గా సంబోధించింది. అలా అయితే కేసీఆర్ కూడా అవినీతిలో భాగస్వామే కాదా?” అని ప్రశ్నించారు. “రాష్ట్రం కోసం వేలాది మంది యువత, ఉద్యోగులు, ప్రజలు పోరాటం చేశారు. అమరుల త్యాగాలను కేసీఆర్ కుటుంబం క్యాష్ చేసుకుంది. తెలంగాణ ఆస్తులను బిఆర్ఎస్ కొల్లగొట్టింది. అవినీతి పరులకు బీజేపీలో స్థానం లేదు. కఠినంగా శిక్షించాలి” అని లక్ష్మణ్ అన్నారు.
పావురాల గుట్టలో ఆ రోజు నిజంగా ఏం జరిగింది..? వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం నిజాలు
తాజావార్తలు
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?