K.A.Paul: రాష్ట్రపతి ఎన్నికల్లో నన్ను సహకరించమని కోరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఇదే విషయాన్ని మోదీ, అమిత్ షాలకు స్పష్టంగా చెప్పానని కేఏ పాల్ అన్నారు. ఎకనామిక్ సమ్మిట్ పెట్టాలని కోరాని.. ఈ వారంలో డేట్ ఫిక్స్ చేస్తామని చెప్పారని ఆయన అన్నారు. మోడీ, అమిత్ షాలు అహ్మదాబాద్ లో సమ్మిట్ ఫెట్టమని అడుగుతున్నారని.. అయితే నేను హైదరాబాద్ లో అయితేనే సమ్మిట్ పెడతా.. అని చెప్పానన్నారు. మీరు అన్నీ అహ్మదాబాద్ తీసుకెళ్తున్నారని.. ఈ విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వనని కేఏ పాల్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో నన్ను సహకరించమని కోరుతున్నారని అన్నారు.
దేశ రాష్ట్రపతి ఎన్నికల్లో నన్ను సహకరించమని కోరారని.. మాకు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరని..దాదాపుగా 18 పార్టీలు సేవ్ సెక్యులర్ ఇండియా కూటమి ఉన్నాయని ఆయన అన్నారు. మమతా బెనర్జీ థర్డ్ ఫ్రంట్ లీడ్ చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు. అయితే ఈ ఫ్రంట్లు, నాలుగు ఫ్రంట్లుగా తయారయ్యాయని.. ప్రతిపక్షాలు యూనిటీగా లేకపోవడం బాధగా ఉందని ఆయన అన్నారు. ఈ నెల 21 లోపు రాష్ట్రపతి అభ్యర్థిని తేల్చేందుకు చర్చిస్తున్నామని అన్నారు. బీజేపీ నాయకులు నన్ను ఈశాన్య రాష్ట్రాల్లో పోటీ చేయమని కోరుతున్నారని.. బీజేపీ తరుపున పోటీ చేసే వ్యక్తే రాష్ట్రపతి అవుతారని ఆయన అన్నారు.
Also Read
- Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- Negligence : జహీరాబాద్ ఆస్పత్రిలో విషాదం.. వైద్యులు లేక శిశువు మృతి
- Pensions: తెలంగాణ పెన్షన్ దారులకు బిగ్షాక్.. లక్ష పెన్షన్లు కట్.. కారణం ఇదే..
- KTR : చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్కు అప్పగించండి.. నీళ్లు ఎత్తి చూపిస్తాం
కేసీఆర్ గురించి చర్చించామని.. ఆయనకు 9 ఎంపీలు ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు గెలవరని సర్వేలు చూపించానని అన్నారు. ప్రశాంత్ కిషోర్ వివిధ ప్రయత్నాలు చేసినా ఫలితం లేదని అన్నారు. కేసీఆర్, దేశ నేతలను కలవడాన్ని ఖండించానని.. కేజ్రీవాల్ కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చానని, దేవెగౌడతో మాట్లాడానని కేఏ పాల్ అన్నారు. తెలంగాణను అప్పులమయంగా చేశారని కేసీఆర్ ను విమర్శించారు. కేసీఆర్ తెలంగాణలో తిరస్కరించబడ్డారని ఆయన అన్నారు. శ్రీకాంత్ చారి తండ్రికి , కుటుంబానికి ఒక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే స్థానం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. 8 ఏళ్లుగా మీరు ఫెయిల్ అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ పోయిందని.. 44 స్థానాలు ఉన్న ఎంపీ స్థానాలు 14కు చేరుతాయని అన్నారు.
తాజావార్తలు
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
-
CM Chandrababu : కుప్పం రైతులకు చంద్రబాబు బిగ్ గిఫ్ట్..!
-
PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
-
Team India: ఇంగ్లాండ్ గడ్డపై శతకాలు బాదిన ముగ్గురు మొనగాళ్లు ఎవరో తెలుసా..? అందులో సూర్య కూడా..
-
Fishing Boat Accident : బోటు మునిగిన భయానక క్షణాలు.. ఓనర్ కన్నీటి గాథ.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!