Jupally Krishna Rao: కేసీఆర్ మళ్లీ అధికారంలో వస్తే రాష్ట్రాన్ని అమ్మేయడం ఖాయం..! జూపల్లి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jupally Krishna Rao: కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు, అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. చివరకు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల రక్తాన్ని కేసీఆర్ కుటుంబం కూడా తింటుందని జూపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారని కేసీఆర్ కు అర్థమైందని… అందుకే రెండు చోట్ల పోటీకి సిద్ధమయ్యారని జూపల్లి అన్నారు. కేసీఆర్ ఓటమిని ముందే అంగీకరించారని అన్నారు. కేసీఆర్ ను ఓడించేందుకు గజ్వేల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని… అందుకే కామారెడ్డిలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. అక్రమంగా సంపాదించిన వందల కోట్లు ఖర్చు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలిచే పరిస్థితి లేదని… కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కడతారని జూపల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
Read also: బిడ్డకు తల్లిపాలు ఎప్పుడు.. ఎలా మాన్పించాలి..?
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
లేనిపక్షంలో బీఆర్ ఎస్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఇప్పుడు వాగ్దానాలు చేస్తున్న కేసీఆర్.. గెలిచాక వాటిని మర్చిపోయే రకం అని అన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని జూపల్లి అన్నారు. మంత్రి హరీశ్రావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుమల సాక్షిగా బీఆర్ఎస్ అధిష్ఠానంపై ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తిరుగుబాటు చేశారని జూపల్లి అన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా తాండూరు టికెట్ రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరిద్దరూ తమ సత్తా చాటేలా కేసీఆర్ కు ఝలక్ ఇవ్వాలని జూపల్లి సూచించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగాదాల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని… అయితే ఇది ఆ పార్టీలో ప్రజాస్వామ్యానికి నిదర్శనమని జూపల్లి అన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి కేసీఆర్ను ఓడించడం ఖాయమన్నారు. జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అవినీతి, అక్రమాలన్నీ బయటపడతాయన్నారు.
తాజావార్తలు
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
-
Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
-
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!