Naveen Yadav : జూబ్లీహిల్స్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
- జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం
- భారీ మెజారిటీతో నన్ను జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించారు
- జూబ్లీహిల్స్ ప్రజలు, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చెయ్యను
- అందరితో కలుపుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. -నవీన్ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసి, తనను ఆదరించిన ప్రజల నమ్మకాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. “ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని, ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని ఇచ్చిన ఆశీర్వాదం వృథా పోదు,” అని నవీన్ యాదవ్ అన్నారు. గతంలో దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేసిన ఆయన, ప్రజల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తానని హామీ ఇచ్చారు.
“ముఖ్యమంత్రి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి, అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా,” అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, ఇకపై ఎలాంటి రాజకీయ వైషమ్యాలకు తావు ఇవ్వబోమని నవీన్ యాదవ్ వెల్లడించారు. గతంలో బీఆర్ఎస్ నాయకులు గెలిచినప్పుడు కొన్ని కక్షపూరిత రాజకీయాలు చేసి ఉండవచ్చని పరోక్షంగా పేర్కొంటూ.. “నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. ఈరోజు వరకే మీరు-మేము. ఇప్పటి నుండి మనం అంతా ఒకటే,” అని స్థానిక ప్రజలు, నాయకులకు భరోసా ఇచ్చారు.
Also Read
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
తాజావార్తలు
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!