JP Nadda: సమయం ఆసన్నమైంది.. కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమయం ఆసన్నమైంది.. కేసీఆర్ పాలనకు గుడ్బై చెప్పాల్సిందేనంటూ పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్వేదికగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ముగింపు సభకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలిపారు. రాజరాజేశ్వరి మాత, కొండగట్టు హనుమాన్ ల ఆశీర్వాదం తీసుకుని, మాట్లాడుతా.. ఒక మంచి ఎంపీ బండి సంజయ్ మీకు దొరికాడా? లేడా? అని ప్రశ్నించారు. పాదయాత్ర 1403 కిలోమీటర్లు పూర్తి చేసుకుని, ఇక్కడికి వచ్చింది.. ఇక్కడితో ఆగేది కాదు ఈ యాత్ర.. ప్రజల గోసకు బీజేపీ భరోసా కల్పిస్తుందన్నారు.. సాలు దొర.. సెలవు దొర పక్కా అంటూ జోస్యం చెప్పారు.
Read Also: CM YS Jagan: మైల’వరం’పై జగన్ ఫోకస్.. పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు..
Also Read
- CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్
- Worker Funny Idea : గుండు తెచ్చిన తంటా.. జుట్టుతో భలే ఐడియా వేసిన వ్యక్తి..!
- Hyderabad Ropeway: హైదరాబాద్లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రోప్వేలకు భారీ ప్రణాళిక.!
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
ఇక, నేను వచ్చేటప్పుడు నా పర్యటనను కూడా ఆపే ప్రయత్నం చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులపై ఫైర్ అయ్యారు జేపీ నడ్డా.. కేసీఆర్ అహంకారాన్ని ప్రజలు చెత్తకుప్పలో వేశారన్న ఆయన.. కేసీఆర్ ప్రభుత్వం ‘అవినీతి, అరాచక, ప్రజా వ్యతిరేక’ ప్రభుత్వం.. కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పాల్సిందేనని పిలుపునిచ్చారు.. సబ్ కా సాత్.. సబ్ కా విశ్వాస్ అన్నది మోడీ పాలనలోనే జరిగింది.. ఎస్టీ మహిళ దేశ రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా అనుకున్నారా? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి జాతీయ రహదారుల కింద భారీ ఎత్తున నిధులు మంజూరు చేశామన్న ఆయన.. జల్ జీవన్ మిషన్ కింద భారీగా నిధులు ఇచ్చాం.. కానీ, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చాడు.. కేసీఆర్ పాలనలో రూ.3.29 లక్షల కోట్ల అప్పుల కుప్పగా రాష్ట్రం మారిందని ఆరోపించారు. కేసీఆర్ తీరు ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరినట్టుంది అని ఎద్దేవా చేశారు.. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన కేసీఆర్ పార్టీకి నెక్స్ట్ బీఆర్ఎస్ తప్పదని జోస్యం చెప్పారు.. దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్.. ఆ హామీని నిలబెట్టుకున్నాడా? అని నిలదీశారు జేపీ నడ్డా.
తెలంగాణ ఆదాయాన్ని, వనరులను కేసీఆర్ లూఠీ చేస్తున్నాడని ఆరోపించారు జేపీ నడ్డా.. “ధరణి పోర్టల్” పేరుతో.. బీఆర్ఎస్ నేతలు పేదల భూములను గుంజుకుంటున్నారన్న ఆయన.. అసదుద్దీన్ ఒవైసీకి భయపడే.. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా కేసీఆర్ జరపడం లేదన్నారు.. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ జరిపిందని గుర్తుచేశారు. ఇక, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.. కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇచ్చాడా? అని ప్రశ్నించారు. కేజీ టు పీజీ ఏమైంది? వెల్నెస్ సెంటర్ల పేరును బస్తీ దవాఖానగా మార్చి నడిపిస్తున్నారే తప్ప, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు.. వెల్నెస్ సెంటర్ లకు బస్తీ ధవాఖానాలకు నక్కకు, నాగ లోకానికి ఉన్న తేడా ఉందని విమర్శించారు. బస్తీ ధవాఖానాల్లో కనీస సదుపాయాలు కూడా లేవన్న ఆయన.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చలేదు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే.. ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావాలి.. తెలంగాణ అభివృద్ధి ని కోరుకునే ప్రతి ఒక్కరూ.. బీజేపీతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ పాదయాత్రలు ఆగవు.. పాదయాత్రలు ఇంకా కొనసాగుతాయి. ప్రతి గడిపను చేరి, ప్రజలకు భరోసా కల్పిస్తాం.. తెలంగాణలో కేసీఆర్ పాలనను ప్రజలు బొందపెట్టడం ఖాయం.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.
తాజావార్తలు
-
Trinamool congress: బెంగాల్లో టీఎంసీ పతనానికి నాంది.. బీజేపీలోకి 20 మంది ఎంపీలు..?
-
Delhi Rain: ఢిల్లీలో భారీ వర్షం.. విమాన రాకపోకలకు అంతరాయం
-
Dal Ki Dulhan : రొటీన్ గా రొట్టెలు తిని విసిగిపోయారా ? అయితే నోరూరించే నార్త్ స్పెషల్ ‘దాల్ కీ దుల్హన్’ ట్రై చేయండి.
-
Anushka Sharma: RCB ఫైనల్ చేరడంలో అనుష్క శర్మ పాత్ర కూడా.. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే..?
-
CM Chandrababu : విజయాలకు కారణమైన కార్యకర్తలకు శాశ్వతంగా రుణపడి ఉంటా
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!