Jogu Ramanna : కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ బోగస్
- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలన్న జోగు రామన్న
- 59 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ
- 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ బోగస్ అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇవాళ ఆయన ఆదిలాబాద్లో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. 59 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, రైతులకు దగా చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు దగా, మోసం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని, రాష్ట్ర మొత్తం మీద కేవలం 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు జోగు రామన్న. మిగతా రైతుల సంగతేంటో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరిట ఒక సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయలను రైతులకు అందజేసిందని ఆయన వెల్లడించారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రైతులను ఇలా పచ్చిగా మోసం చేయలేదని ఆయన పేర్కొన్నారు.
Jani Master: బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు.. ఏ సినిమాకో తెలుసా?
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
అంతేకాకుండా.. సీఎం రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేసినందుకు నోబెల్ ప్రైజ్ ఇచ్చిన తక్కువే అని, ఇప్పటికే మొదటి విడత రెండో విడత రుణమాఫీ జరుగక వేలాదిమంది రైతులు బ్యాంకుల చుట్టూ కలెక్టర్ కార్యాలయం చుట్టూ వ్యవసాయ శాఖ కార్యాలయ చుట్టూ తిరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మూడో విడత రుణమాఫీ దేవుడెరుగు అని, రుణమాఫీ విషయంలో రైతులతో నేరుగా మాట్లాడే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. దమ్ముంటే అదిలాబాదులో ఏ గ్రామానికి అయినా వచ్చి మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పై రైతులతో చర్చించాలి. తప్పులు తడకగా రుణమాఫీలో రైతుల లిస్టు అని, అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు, ప్రభుత్వం, పని చేస్తుందా అన్న అనుమానం కలుగుతుందన్నారు. ఇచ్చిన హామీపై ఇచ్చిన మాట పై నిలబడని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నోరు పారేసుకుని జనంలో నవ్వుల పాలవుతున్నారని జోగు రామన్న మండిపడ్డారు.
Demonte Colony 2: వణికి పోవడానికి రెడీ అవ్వండి.. “డిమాంటీ కాలనీ 2” వచ్చేస్తోంది!
తాజావార్తలు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!