JEE Main: రేపటి నుంచి జేఈఈ మెయిన్ -2 పరీక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JEE Main: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ ఫైనల్ పరీక్ష నిర్వహణకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో ప్రధాన కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల వివరాలు ఇప్పటికే విడుదల చేయగా, అడ్మిట్ కార్డులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.
మన తెలుగు రాష్ట్రాల నుంచి 50 వేల మంది ఈ పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులను పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగా పరీక్షా కేంద్రాలకు పంపిస్తారు. ఇంగ్లీషుతో పాటు తెలుగు, ఉర్దూ వంటి ప్రాంతీయ భాషల్లో కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. బీఈ, బీటెక్ పరీక్షలను సాధారణ విద్యార్థులకు 3 గంటలు, వికలాంగ అభ్యర్థులకు 4 గంటల పాటు నిర్వహిస్తారు.
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
- Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
Read also: Kejriwal: కేజ్రీవాల్కు ఆనారోగ్యం.. 4.5 కేజీల బరువు తగ్గిన ఢిల్లీ సీఎం
పరీక్ష సమయం
* మొదటి షిఫ్ట్: ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు
* రెండవ షిఫ్ట్: 3 PM నుండి 6 PM (గమనిక – BARC, BPlanning కోసం అదనపు సమయం కేటాయించబడుతుంది)
సూచనలు..
* అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డును తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు లేకుంటే పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
* అభ్యర్థులు వారి ధృవీకరణను సూచించే వారి ఫోటో ID కార్డులను తీసుకెళ్లాలి. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్లో ఏదైనా ఒక కార్డు తీసుకెళ్లాలి.
* హాజరు పట్టీపై ఫొటో అతికించాల్సి ఉన్నందున పాస్పోర్టు సైజు ఫొటోను కేంద్రానికి తీసుకెళ్లాలి.
* పారదర్శకమైన బాల్ పాయింట్ పెన్ను తీసుకోవడం మంచిది.
* వికలాంగ అభ్యర్థుల విషయంలో, వారు మెడికల్ ఆఫీసర్ చేత ధృవీకరించబడిన ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
* అడ్మిట్ కార్డులో ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా చదవాలి.
* పరీక్ష సమయానికి రెండు గంటల ముందు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి.
* పరీక్షకు సంబంధించి ఏదైనా ఇబ్బంది ఎదురైతే, సెంటర్ సూపరింటెండెంట్ లేదా ఇన్విజిలేటర్ను సంప్రదించవచ్చు.
* పరీక్షా కేంద్రంలో ఇచ్చిన రఫ్ షీట్లపైనే లెక్కలు, రాత పనులు చేయాలి. ఆ తర్వాత రఫ్ షీట్లను ఇన్విజిలేటర్కు అప్పగించాలి.
Kejriwal: కేజ్రీవాల్కు ఆనారోగ్యం.. 4.5 కేజీల బరువు తగ్గిన ఢిల్లీ సీఎం
తాజావార్తలు
-
Astrology: జూలై 21 మంగళవారం దినఫలాలు..
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!