India Post GDS Recruitment 2026: గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్.. 28740 పోస్టులు.. దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్
- పోస్టల్ శాఖలో 28740 పోస్టులు
- 10వ తరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి
- 40 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు
- ఫిబ్రవరి 16, 2026 వరకు గడువు ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనున్నది. ఈ నియామకానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 14. నిర్ణీత తేదీలలోపు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంకా అప్లికేషన్ పూర్తి చేయని అభ్యర్థులకు ఈరోజు, ఫిబ్రవరి 16, 2026 వరకు గడువు ఉంది. అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్, indiapostgdsonline.gov.in ని సందర్శించి, ఫారమ్ను పూర్తి చేసి, ఆలస్యం చేయకుండా సమర్పించాలి. దరఖాస్తు ఫారమ్ నింపడంలో ఏవైనా తప్పులు చేసిన అభ్యర్థులు ఎడిట్ చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ ఫిబ్రవరి 18, 19, 2026 మధ్య ఎడిట్ విండోను తెరుస్తుంది. ఈ తేదీలలోపు అభ్యర్థులు తమ ఆన్లైన్ ఫారమ్లకు దిద్దుబాట్లు చేసుకోగలరు.
Also Read:Thorrur Municipality: తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికపై ఉద్రిక్తత..
Also Read
- AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
- Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
- Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
- Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
ఇండియా పోస్ట్ GDS రిక్రూట్మెంట్ 2026కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థి తప్పనిసరిగా భారతీయ పౌరుడు అయి ఉండాలి.
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి 10వ తరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
10వ తరగతిలో గణితం, ఆంగ్ల సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Also Read:Bill Gates-Chandrababu: బిల్గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ!
జనరల్, OBC అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC, ST, దివ్యాంగ అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఈ నియామక డ్రైవ్ 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 28,740 ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 – రూ.29,380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470 వేతనం ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి సమాచారం ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది. అప్లై చేసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Spider Man: భారత్లో ‘స్పైడర్ మ్యాన్’ సునామీ… రూ. 500 కోట్ల క్లబ్పై మార్వెల్ కన్ను
-
AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
-
Vijay Varma: హీరో కాకముందు కాస్టింగ్ కౌచ్.. విజయ్ వర్మ షాకింగ్ వ్యాఖ్యలు.. హైదరాబాద్లో జరిగిన ఘటన ఏంటి?
-
Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
-
Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!