Jana Reddy : శంకుస్థాపనలతోనే గొప్పలు.. పనులు మాత్రం నిల్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప పనులు చేయడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి… నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం గ్రామ సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. నాగార్జునసాగర్ ఎడమ కాలువ సుమారుగా 60 సంవత్సరాలు అయ్యింది… కానీ, కాలువల భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.. పెద్దవూర మినీ గురుకుల పాఠశాలకు కనీస వసతులు లేని బిల్డింగ్లో ఏర్పాటు చేయడం సిగ్గుచేటుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మినీ గురుకుల పాఠశాల విద్యార్థులు సురక్షితంగా కాపాడిన పోలీసు అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప పనులు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Punjab: పీఎస్లోనే రివాల్వర్తో కాల్చుకుని ఏఎస్సై ఆత్మహత్య.. వీడియో రికార్డు చేసి మరీ..
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
మరోవైపు, కాలువ గండిపడి నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్ట సహాయంగా 15,000 వేల రూపాయల నుండి 20,000 వేల రూపాయల వరకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు జానారెడ్డి… నిడమనూరు నర్సింగగూడెం గ్రామంలో ఇళ్లల్లో నీరు చేరిన బాధితులను ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలని కోరిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ నుండి ఇళ్లల్లో నీరు చేరుకున్న ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి.. వాళ్లు తిరిగి ఇళ్లలోకి వెళ్లే వరకు బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. కాగా, కృష్ణా నదిలో భారీ వరద కొనసాగుతోన్న నేపథ్యంలో.. ఎగువ ప్రాజెక్టుల్లో నీటిని విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు చేరుతోంది. ఇక, సాగర్ నుంచి కూడా నీరు విడుదల చేస్తున్నారు.. అయితే, సాగర్ ఎడమ కాలువకు గండి పడి సమీప గ్రామాల్లోని పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా పలుచోట్ల భారీ పంట నష్టాన్ని మిగిల్చింది. చాలా మంది నిరాశ్రయులయ్యారు.. నిడమానూరు మండలం ముప్పారం 39వ కిలోమీటర్ వద్ద బుధవారం సాగర్ ప్రాజెక్టుకు గండిపడిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!