Jana Reddy : శంకుస్థాపనలతోనే గొప్పలు.. పనులు మాత్రం నిల్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప పనులు చేయడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి… నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం గ్రామ సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. నాగార్జునసాగర్ ఎడమ కాలువ సుమారుగా 60 సంవత్సరాలు అయ్యింది… కానీ, కాలువల భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.. పెద్దవూర మినీ గురుకుల పాఠశాలకు కనీస వసతులు లేని బిల్డింగ్లో ఏర్పాటు చేయడం సిగ్గుచేటుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మినీ గురుకుల పాఠశాల విద్యార్థులు సురక్షితంగా కాపాడిన పోలీసు అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప పనులు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Punjab: పీఎస్లోనే రివాల్వర్తో కాల్చుకుని ఏఎస్సై ఆత్మహత్య.. వీడియో రికార్డు చేసి మరీ..
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
మరోవైపు, కాలువ గండిపడి నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్ట సహాయంగా 15,000 వేల రూపాయల నుండి 20,000 వేల రూపాయల వరకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు జానారెడ్డి… నిడమనూరు నర్సింగగూడెం గ్రామంలో ఇళ్లల్లో నీరు చేరిన బాధితులను ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలని కోరిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ నుండి ఇళ్లల్లో నీరు చేరుకున్న ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి.. వాళ్లు తిరిగి ఇళ్లలోకి వెళ్లే వరకు బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. కాగా, కృష్ణా నదిలో భారీ వరద కొనసాగుతోన్న నేపథ్యంలో.. ఎగువ ప్రాజెక్టుల్లో నీటిని విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు చేరుతోంది. ఇక, సాగర్ నుంచి కూడా నీరు విడుదల చేస్తున్నారు.. అయితే, సాగర్ ఎడమ కాలువకు గండి పడి సమీప గ్రామాల్లోని పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా పలుచోట్ల భారీ పంట నష్టాన్ని మిగిల్చింది. చాలా మంది నిరాశ్రయులయ్యారు.. నిడమానూరు మండలం ముప్పారం 39వ కిలోమీటర్ వద్ద బుధవారం సాగర్ ప్రాజెక్టుకు గండిపడిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!