Jana Reddy : శంకుస్థాపనలతోనే గొప్పలు.. పనులు మాత్రం నిల్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప పనులు చేయడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి… నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం గ్రామ సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. నాగార్జునసాగర్ ఎడమ కాలువ సుమారుగా 60 సంవత్సరాలు అయ్యింది… కానీ, కాలువల భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.. పెద్దవూర మినీ గురుకుల పాఠశాలకు కనీస వసతులు లేని బిల్డింగ్లో ఏర్పాటు చేయడం సిగ్గుచేటుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మినీ గురుకుల పాఠశాల విద్యార్థులు సురక్షితంగా కాపాడిన పోలీసు అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప పనులు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Punjab: పీఎస్లోనే రివాల్వర్తో కాల్చుకుని ఏఎస్సై ఆత్మహత్య.. వీడియో రికార్డు చేసి మరీ..
Also Read
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
మరోవైపు, కాలువ గండిపడి నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్ట సహాయంగా 15,000 వేల రూపాయల నుండి 20,000 వేల రూపాయల వరకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు జానారెడ్డి… నిడమనూరు నర్సింగగూడెం గ్రామంలో ఇళ్లల్లో నీరు చేరిన బాధితులను ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలని కోరిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ నుండి ఇళ్లల్లో నీరు చేరుకున్న ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి.. వాళ్లు తిరిగి ఇళ్లలోకి వెళ్లే వరకు బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. కాగా, కృష్ణా నదిలో భారీ వరద కొనసాగుతోన్న నేపథ్యంలో.. ఎగువ ప్రాజెక్టుల్లో నీటిని విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు చేరుతోంది. ఇక, సాగర్ నుంచి కూడా నీరు విడుదల చేస్తున్నారు.. అయితే, సాగర్ ఎడమ కాలువకు గండి పడి సమీప గ్రామాల్లోని పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా పలుచోట్ల భారీ పంట నష్టాన్ని మిగిల్చింది. చాలా మంది నిరాశ్రయులయ్యారు.. నిడమానూరు మండలం ముప్పారం 39వ కిలోమీటర్ వద్ద బుధవారం సాగర్ ప్రాజెక్టుకు గండిపడిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్పై కోహ్లీ ఫైర్..
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..