Jagityala: దమ్మన్నపేటలో భారీ చోరీ.. పొలం పనులకు వెళ్లి తిరిగొచ్చేలోపే 14 తులాల బంగారు ఆభరణాలు మాయం
- దమ్మన్నపేటలో భారీ చోరీ
- పొలం పనులకు వెళ్లి తిరిగొచ్చేలోపే 14 తులాల బంగారు ఆభరణాలు మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల జిల్లాలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో భారీ చోరీకి పాల్పడ్డారు. పొలం పనులకు వెళ్లి తిరిగొచ్చేలోపే 14 తులాల బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న మహిళకు ఊహించని షాక్ తగిలింది. తాళం వేసి ఉన్న ఇళ్లు చోరికి గురికావడంతో లబోదిబోమన్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏనుగు పద్మ అనే మహిళ ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లింది.
ఇదే అదునుగా భావించిన దుండగులు చోరికి పాల్పడ్డారు. ఇంటి తాళం పగలగొట్టి బెడ్ రూమ్ కబోర్డ్ లోని సుమారు 14 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగివచ్చిన ఏనుగు పద్మ ఇంట్లో చోరి జరిగిందని గుర్తించింది. వెంటనే పోలీలసులకు సమాచారం అందించింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చోరి జరిగిన తీరుపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
కాగా మూడు రోజులుగా వరుసగా పలు మండలాల్లో చోరీలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కథలాపూర్ మండలం ఉట్ పల్లి లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో ఉన్న సుమారు 7 తులాల బంగారు ఆభరణాలు ఇద్దరు మాయ లేడీలు ఎత్తుకెళ్లారు. నిన్న కోరుట్ల బస్టాండ్ వద్ద ప్రయాణికురాలి పర్సును (4తులాల బంగారు ఆభరణాలు) గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కథలాపూర్ మండలంలో జరిగిన చోరీ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు ఇద్దరు మహిళలను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.
తాజావార్తలు
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
-
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!