K. Laxman: ఇది మూడోసారి.. రేపటి కార్యక్రమానికి కేసీఆర్ హాజరైతే మంచిది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K. Laxman: కేసీఆర్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికి ఇది మూడోసారి. ఇది సబబు కాదన్నారు. రాజకీయ, అభివృద్ధికి మధ్య వ్యత్యాసాలను కేసీఆర్ గుర్తించడంలేదని అన్నారు. రేపు రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. బేగం పెట్ Air port లో కార్యకర్తల నుద్దేశించి ప్రసంగించనున్నారు మోడీ. ఈనేపథ్యంలో.. Airport లో ఏర్పాట్లను బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా.. బిజెపి పార్లమెంటరీ బోర్డు మెంబర్ కే.లక్ష్మణ్ మాట్లాడుతూ.. Airport లో కార్యకర్తలతో మాత్రమే మీటింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ రేపటి కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్ర బీజేపీ తరఫున కోరుతున్నామన్నారు. సమాఖ్య స్పూర్తిని మోడీ గౌరవిస్తున్నారని అన్నారు. బీజేపీయేతర పాలనలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. 25 వేల కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ పర్యటన కొనసాగుతుంద లక్ష్మణ్ తెలిపారు. తమిళ్ నాడు, ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీని పార్టీలకతీతంగా ఆహ్వానిస్తుంటే.. తెలంగాణలో మాత్రం స్వాగతించడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికి ఇది మూడోసారని,ఇది సబబు కాదన్నారు. రాజకీయ, అభివృద్ధికి మధ్య వ్యత్యాసాలను కేసీఆర్ గుర్తించడంలేదని అన్నారు.
read also: Vijay Devarakonda : ఆ నొప్పినుంచి పూర్తిగా కోలుకున్నా..
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
గతంలో రైతులు ఎరువుల కోసం బారులుదీరేవారు. బ్లాక్ దందా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. చెప్పులు క్యూలో పెట్టి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. రాజకీయాలు వేరు.. ప్రభుత్వాలు వేరు.. అని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నా మోడీ అభివృద్ధి పనులు చేపడుతున్నారని అన్నారు. చేనేతపై జీఎస్టీ కౌన్సిల్ లో పాల్గొని అప్పుడు ఒకే చెప్పి ఇప్పుడు బురదజల్లడం సరికాదని మండిపడ్డారు. ఈవిషయంలో హరీష్ రావు మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు బీమా ఎందుకు ఇవ్వట్లేదు? అని ప్రశ్నించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరిట పోస్టల్ కార్డులు విడుదల చేశామన్నారు. మీరు వారిని అవమానించారని అన్నారు. అలాంటిది మోడీ పర్యటనను అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయాలకతీతంగా ఈ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనాలని అన్నారు. Airport లో కార్యకర్తలతో మాత్రమే మీటింగ్ ఉంటుందని అన్నారు. పక్క రాష్ట్రం సీఎం జగన్ ను చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని సంచళన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో దగ్గరుండి అభివృద్ధి చేయమని మోడీని అడగాల్సింది పోయి రాకుండా ఉండటం సరికాదని మండిపడ్డారు. కేసీఆర్ నిర్ణయాలు తెలంగాణకే నష్టమని ఆరోపించారు.
Allu Arjun: రియల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కేరళ నర్సింగ్ విద్యార్థిని దత్తత!
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!