K. Laxman: ఇది మూడోసారి.. రేపటి కార్యక్రమానికి కేసీఆర్ హాజరైతే మంచిది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K. Laxman: కేసీఆర్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికి ఇది మూడోసారి. ఇది సబబు కాదన్నారు. రాజకీయ, అభివృద్ధికి మధ్య వ్యత్యాసాలను కేసీఆర్ గుర్తించడంలేదని అన్నారు. రేపు రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. బేగం పెట్ Air port లో కార్యకర్తల నుద్దేశించి ప్రసంగించనున్నారు మోడీ. ఈనేపథ్యంలో.. Airport లో ఏర్పాట్లను బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా.. బిజెపి పార్లమెంటరీ బోర్డు మెంబర్ కే.లక్ష్మణ్ మాట్లాడుతూ.. Airport లో కార్యకర్తలతో మాత్రమే మీటింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ రేపటి కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్ర బీజేపీ తరఫున కోరుతున్నామన్నారు. సమాఖ్య స్పూర్తిని మోడీ గౌరవిస్తున్నారని అన్నారు. బీజేపీయేతర పాలనలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. 25 వేల కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ పర్యటన కొనసాగుతుంద లక్ష్మణ్ తెలిపారు. తమిళ్ నాడు, ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీని పార్టీలకతీతంగా ఆహ్వానిస్తుంటే.. తెలంగాణలో మాత్రం స్వాగతించడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికి ఇది మూడోసారని,ఇది సబబు కాదన్నారు. రాజకీయ, అభివృద్ధికి మధ్య వ్యత్యాసాలను కేసీఆర్ గుర్తించడంలేదని అన్నారు.
read also: Vijay Devarakonda : ఆ నొప్పినుంచి పూర్తిగా కోలుకున్నా..
Also Read
గతంలో రైతులు ఎరువుల కోసం బారులుదీరేవారు. బ్లాక్ దందా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. చెప్పులు క్యూలో పెట్టి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. రాజకీయాలు వేరు.. ప్రభుత్వాలు వేరు.. అని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నా మోడీ అభివృద్ధి పనులు చేపడుతున్నారని అన్నారు. చేనేతపై జీఎస్టీ కౌన్సిల్ లో పాల్గొని అప్పుడు ఒకే చెప్పి ఇప్పుడు బురదజల్లడం సరికాదని మండిపడ్డారు. ఈవిషయంలో హరీష్ రావు మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు బీమా ఎందుకు ఇవ్వట్లేదు? అని ప్రశ్నించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరిట పోస్టల్ కార్డులు విడుదల చేశామన్నారు. మీరు వారిని అవమానించారని అన్నారు. అలాంటిది మోడీ పర్యటనను అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయాలకతీతంగా ఈ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనాలని అన్నారు. Airport లో కార్యకర్తలతో మాత్రమే మీటింగ్ ఉంటుందని అన్నారు. పక్క రాష్ట్రం సీఎం జగన్ ను చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని సంచళన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో దగ్గరుండి అభివృద్ధి చేయమని మోడీని అడగాల్సింది పోయి రాకుండా ఉండటం సరికాదని మండిపడ్డారు. కేసీఆర్ నిర్ణయాలు తెలంగాణకే నష్టమని ఆరోపించారు.
Allu Arjun: రియల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కేరళ నర్సింగ్ విద్యార్థిని దత్తత!
తాజావార్తలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!