Gangster Nayeem: నయీమ్ కేసులో కీలక మలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. 2016, ఆగష్టులో తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్లో హతం అయ్యాడు నయీమ్.. ఇక, నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పెద్ద మొత్తంలో ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. నయీమ్తోపాటు అతడి భార్యాపిల్లలు, బావమరిది, బినామీల పేరుతో పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించారు. ఇదే సమయంలో పెద్ద మొత్తంలో నగదు, బంగారం దొరకినట్టు కూడా వార్తలు వచ్చాయి.. అయితే, ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగింది.. నయీమ్ బినామీ ఆస్తులను జప్తు చేయాలని ఐటీశాఖ నిర్ణయించింది.. ఆస్తులను సీజ్ చేసింది ఐటీ శాఖ.. మొత్తం 45 ఆస్తులు ఉన్నట్టు గతంలోనే ఐటీ శాఖ గుర్తించగా.. అందులో పది ఆస్తులను ఇప్పుడు సీజ్ చేశారు.. ఈ పది ఆస్తులు విలువ సుమారు 150 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.. ఇక, ఆస్తులు సీజ్ విషయంపై నయీమ్ భార్యకు నోటీసులు ఇచ్చారు ఐటీ శాఖ అధికారులు. నయీమ్ ఎన్కౌంటర్.. పోలీసుల సోదాలు, ఐటీ దాడుల తర్వాత చోటు చేసుకున్న ఈ పరిణామం ఇప్పుడు కీలకంగా మారింది.
Read Also: Nara Lokesh: కబ్జాల నుండి విశాఖని రక్షించుకుందాం.. మీకు అండగా ఉంటాం..
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!