వారిపై లీగల్ యాక్షన్… వైఎస్ షర్మిల పార్టీ నేతల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది రియలో.. ఏది వైరలో తెలియని పరిస్థితి… కొందరు కేటుగాళ్లు ఇష్టంవచ్చినట్టుగా తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారు.. అది తెలియకకొందరు.. తెలిసి మరికొందరు షేర్ చేస్తూ.. అందులో భాగస్వాములు అవుతున్నారు.. అయితే, తెలంగాణ మంత్రి కేటీఆర్, వైఎస్ షర్మిల ఫొటోలతో.. హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించిన ఓ తప్పుడు వార్త వైరల్ చేశారు కేటుగాళ్లు.. దీనిపై వైఎస్ షర్మిల అనుచరులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. బుధవారం రోజు సోషల్ మీడియాలో మేం పెట్టబోయే పార్టీపై అసూయతో.. రాజన్న పేరుతో మమ్మల్ని కించపరిచే పనులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందిర శోభన్.. లోటస్పాండ్లో మీడియాతో మాట్లాడిన ఆమె.. షర్మిల, కేటీఆర్ ఫొటోలు షేర్ చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారంటూ బీజేపీ శ్రేణులపై ఫైర్ అయ్యారు.. సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనలు చేసే వారిపైనే లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించిన ఆమె.. మైండ్ గేమ్ ఆడితే ఎవరు భయపడే పనిలేదన్నారు.
also read: మంత్రి ప్రశాంత్రెడ్డిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
తమ పార్టీపై అబద్దాలు చెప్పడం వల్ల ఒరిగేదేమి లేదన్నారు ఇందిర శోభన్.. బీజేపీ కుటిల రాజకీయాలు చేయడంలో దిట్ట అని విమర్శించిన ఆమె.. ఈ రుమోర్స్ వెనుకాల పూర్తిగా బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు.. బీజేపీ శ్రేణులు అంతా అబద్దాలు చెబుతూ ఆత్మ సంసృప్తి చెందుతున్నారని ఎద్దేవా చేసిన ఆమె.. ప్రజల కష్టాలు తీర్చడంలో బీజేపీ పూర్తిగా విఫలం అయ్యిందని ఫైర్ అయ్యారు.. దుబ్బాకలో కూడా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ వచ్చారన్న ఆమె.. ఇలాగే రూమర్స్ చేయడంలో బీజేపీకి పరిపాటిగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. దయచేసి కేంద్రం నిధులు సక్రమంగా ఖర్చు చేసేలా చూడాలని.. కానీ, చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు.. బీజేపీ – అంటే బడా జూటా పార్టీ అంటూ కామెంట్ చేసిన ఆమె.. దమ్ముంటే మా వైఎస్ షర్మిల కార్యాచరణ విషయంలో.. విధానంలో పోటీపడాలన్నారు.. పార్టీ నాయకులని కొనడంతో మీరు ముందున్నారంటూ బీజేపీపై సెటైర్లు వేసిన ఇందిర శోభన్.. బీజేపీకి దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తెల్చుకుందాం రండీ అంటూ సవాల్ చేశారు.. సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారామె.
తాజావార్తలు
-
NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
-
TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
-
Vaibhav Suryavanshi: అది బుడ్డోడి రేంజ్.. వైభవ్ సూర్యవంశీ కోసం వేలం వ్యూహాన్ని మార్చుకున్న రాజస్థాన్..!
-
Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!