తెలంగాణ స్కూళ్లలో పెరిగిన విద్యార్థుల హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పద్దెనిమిది నెలల తరువాత తెలంగాణాలో మళ్ళీ ఈ నెల 1వ తారీఖు నుంచి స్కూల్స్ తెరుచుకున్నాయి. అయితే హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో విద్యార్థులు స్కూల్స్ కి ఖచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది.గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 5,526 ప్రైవేటు.. 2,249 గవర్నమెంట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 16 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. వీరిలో తొలి రోజు చాలాచోట్ల విద్యార్థుల హాజరు నామమాత్రంగానే కనిపించింది. సుమారు 21.77 శాతం మంది విద్యార్థులు మొదటి రోజు ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 35 శాతానికి చేరుకుంది.
Also Read
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
తల్లిదండ్రులు.. విద్యార్థులను భయం లేకుండా స్కూళ్లకు పంపిస్తున్నారని చెబుతున్నారు టీచర్లు. స్కూల్ మొత్తాన్ని రోజు సానిటైజ్ చేస్తున్నామని, స్కూల్లోనే వారికి మాస్క్ కూడా ఇచ్చి వాటిని పెట్టుకునేల ఏర్పాట్లు చేశామని అంటున్నారు. బైట్ : ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. చాలా రోజుల తరువాత స్కూల్స్ కి వెళ్లడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ క్లాసుల కంటే ఆఫ్లైన్ క్లాసులు బాగున్నాయంటున్నారు విద్యార్థులు. ప్రభుత్వం ఆదేశాల మేరకు పాఠశాలలు కరోనా నిబంధనలు పాటిస్తున్నాయి. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తొలి రోజు వచ్చిన విద్యార్థుల హాజరు శాతానికి నేటికీ చాలా తేడా ఉంది. త్వరలోనే మళ్ళీ అన్ని స్కూల్స్ విద్యార్థులతో నిండిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Mothers Day Special: మాతృత్వానికి ప్రణామం.. సృష్టికి ప్రతిరూపం.. సహనానికి నిలువుటద్దం “అమ్మ”
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్