Rajnath Singh: 2026 ఆగస్టులోపే నక్సల్స్ను తుడిచిపెట్టేస్తాం..
- చాలా మంది యోధులు చిన్న వయసులోనే స్వాతంత్ర్య కోసం ప్రాణాలు వదిలారు..
- ల్లూరి సీతారామరాజు జీవించిన ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది..
- 2026 ఆగస్టులోపే నక్సల్స్ను తుడిచిపెట్టేస్తాం: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: చాలా మంది యోధులు చిన్న వయసులోనే స్వాతంత్ర్య కోసం ప్రాణాలు వదిలారు అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వంటి వాళ్ళు ఎంతోమంది తమ ప్రాణాలు వదిలారు.. భారత స్వాభిమానం, తెలుగు రాష్ట్రాల గుర్తుగా నిలిచిపోయారు.. అల్లూరి కేవలం పోరాట యోధుడే కాదు ప్రజలు కోసం అన్ని కోల్పోయిన నాయకుడు గుర్తుకు వస్తాడు.. సాంస్కృతిక ఆత్మ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచుతుంది.. అల్లూరి పేరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కే కాదు దేశం మొత్తం గుర్తింపు ఉంది.. ఆడవుల నుంచి పుట్టిన పోరాటాలు ఇప్పటికీ గుర్తున్నాయి.. దశాబ్దాల పోరాటాలకు ఆయన మార్గదర్శనం చేశారు.. అడవుల్లో ఆయన పోరాటాలు బ్రిటిష్ వారిని వణికించాయి.. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలు ఎత్తాల్సి వచ్చింది అని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
Read Also: Minister Nara Lokesh: ఇంటర్ విద్యపై లోకేష్ సమీక్ష.. కీలక ఆదేశాలు
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
ఇక, గిరిజనులపై, వారి భూమి పై ఆంక్షలు విధించారు అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గౌరవంగా జీవించాదని అల్లూరి సీతారామరాజు పిలుపు ఇచ్చారు.. అల్లూరి సీతారామరాజు జీవించిన ప్రాంతాలను కేంద్రం అభివృద్ధి చేస్తుంది.. బాలికల చదువు కోసం పాఠశాల ల అభివృద్ధి జరుగుతుంది.. 108 సూర్య నమస్కారాలు కేవలం దేహం దారుధ్యం కోసం కాదు.. మానసిక అభ్యున్నతికి ఉపయోగపడతాయి.. క్రమంగా అడవులు నక్సల్స్ కు అడ్డంగా మారాయి.. ఇప్పుడు నక్సల్స్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతున్నాయి.. ఆగస్టు 2026లోపే నక్సల్స్ ను తుడిచి పెట్టేస్తాం.. నక్సల్స్ చేతిలో బంధీగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి వేగంగా జరుగుతోంది.. వేగంగా గ్రోత్ కారిడార్ లుగా అభివృద్ధి చెందుతున్నాయి.. కనీసం నెట్వర్క్ లేకపోయేది.. టీవీలు, ల్యాప్ టాప్ లు, మొబైల్ టవల్ లు కూడా లేకుండాపోయాయి.. 8 వేల టవర్లను ప్రారంభించేందుకు సిద్ధం గా ఉన్నాయని రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
పహెల్గామ్ లో దాడి తరువాత ఆపరేషన్ సింధూర్ తో ధైర్యం, ధర్మం, ఖర్మను పరిచయం చేశామని రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. రామాయణంలో హనుమంతుడు చేసిన పనే ఇప్పుడు మనం చేశాం.. మనల్ని ఎవరు చంపారో వారిని మాత్రమే చంపాం.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే తగిన సమాధానం చెబుతాం.. న్యాయం అందిరికీ సమానం గా దక్కాలి.. జాతి నిర్మాణంలో గిరిజనుల పాత్ర మరువలేనిది.. ఆదివాసీలను సాధారణ జనజీవనంలోకి తీసుకుని రావాల్సిన అవసరం ఉంది.. 50, 000లకు పైగా ఆదివాసీ గ్రూపులను ఏర్పాటు చేశాం.. మొదటి సారి గిరిజన మహిళను రాష్ట్రపతి చేశాం.. అల్లూరి సీతారామరాజు సంకల్పాన్ని ప్రతి గ్రామం, ఇంటికి తీసుకుని వెళ్దామని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!