Rajnath Singh: 2026 ఆగస్టులోపే నక్సల్స్ను తుడిచిపెట్టేస్తాం..
- చాలా మంది యోధులు చిన్న వయసులోనే స్వాతంత్ర్య కోసం ప్రాణాలు వదిలారు..
- ల్లూరి సీతారామరాజు జీవించిన ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది..
- 2026 ఆగస్టులోపే నక్సల్స్ను తుడిచిపెట్టేస్తాం: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: చాలా మంది యోధులు చిన్న వయసులోనే స్వాతంత్ర్య కోసం ప్రాణాలు వదిలారు అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వంటి వాళ్ళు ఎంతోమంది తమ ప్రాణాలు వదిలారు.. భారత స్వాభిమానం, తెలుగు రాష్ట్రాల గుర్తుగా నిలిచిపోయారు.. అల్లూరి కేవలం పోరాట యోధుడే కాదు ప్రజలు కోసం అన్ని కోల్పోయిన నాయకుడు గుర్తుకు వస్తాడు.. సాంస్కృతిక ఆత్మ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచుతుంది.. అల్లూరి పేరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కే కాదు దేశం మొత్తం గుర్తింపు ఉంది.. ఆడవుల నుంచి పుట్టిన పోరాటాలు ఇప్పటికీ గుర్తున్నాయి.. దశాబ్దాల పోరాటాలకు ఆయన మార్గదర్శనం చేశారు.. అడవుల్లో ఆయన పోరాటాలు బ్రిటిష్ వారిని వణికించాయి.. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలు ఎత్తాల్సి వచ్చింది అని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
Read Also: Minister Nara Lokesh: ఇంటర్ విద్యపై లోకేష్ సమీక్ష.. కీలక ఆదేశాలు
Also Read
ఇక, గిరిజనులపై, వారి భూమి పై ఆంక్షలు విధించారు అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గౌరవంగా జీవించాదని అల్లూరి సీతారామరాజు పిలుపు ఇచ్చారు.. అల్లూరి సీతారామరాజు జీవించిన ప్రాంతాలను కేంద్రం అభివృద్ధి చేస్తుంది.. బాలికల చదువు కోసం పాఠశాల ల అభివృద్ధి జరుగుతుంది.. 108 సూర్య నమస్కారాలు కేవలం దేహం దారుధ్యం కోసం కాదు.. మానసిక అభ్యున్నతికి ఉపయోగపడతాయి.. క్రమంగా అడవులు నక్సల్స్ కు అడ్డంగా మారాయి.. ఇప్పుడు నక్సల్స్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతున్నాయి.. ఆగస్టు 2026లోపే నక్సల్స్ ను తుడిచి పెట్టేస్తాం.. నక్సల్స్ చేతిలో బంధీగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి వేగంగా జరుగుతోంది.. వేగంగా గ్రోత్ కారిడార్ లుగా అభివృద్ధి చెందుతున్నాయి.. కనీసం నెట్వర్క్ లేకపోయేది.. టీవీలు, ల్యాప్ టాప్ లు, మొబైల్ టవల్ లు కూడా లేకుండాపోయాయి.. 8 వేల టవర్లను ప్రారంభించేందుకు సిద్ధం గా ఉన్నాయని రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
పహెల్గామ్ లో దాడి తరువాత ఆపరేషన్ సింధూర్ తో ధైర్యం, ధర్మం, ఖర్మను పరిచయం చేశామని రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. రామాయణంలో హనుమంతుడు చేసిన పనే ఇప్పుడు మనం చేశాం.. మనల్ని ఎవరు చంపారో వారిని మాత్రమే చంపాం.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే తగిన సమాధానం చెబుతాం.. న్యాయం అందిరికీ సమానం గా దక్కాలి.. జాతి నిర్మాణంలో గిరిజనుల పాత్ర మరువలేనిది.. ఆదివాసీలను సాధారణ జనజీవనంలోకి తీసుకుని రావాల్సిన అవసరం ఉంది.. 50, 000లకు పైగా ఆదివాసీ గ్రూపులను ఏర్పాటు చేశాం.. మొదటి సారి గిరిజన మహిళను రాష్ట్రపతి చేశాం.. అల్లూరి సీతారామరాజు సంకల్పాన్ని ప్రతి గ్రామం, ఇంటికి తీసుకుని వెళ్దామని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Harish Rao: “నీకు మా రక్తం కావాలా”.. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
-
Muzammil Ibrahim: ప్రేమను మొదలుపెట్టింది ఆమెనే, కానీ బ్రేకప్ చేసింది నేనే!.. దీపికా మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు..
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Aamir Khan: పెళ్లి తర్వాత ఆమిర్ ఖాన్ భారీ నిర్ణయం..100 కోట్లకు పైగా ఖర్చుతో కలల ఇంటి నిర్మాణం!
-
Revolt RVX vs Oben Rorr Evo: రివోల్ట్ RVX Vs ఓబెన్ రోర్ ఈవో.. ధర, రేంజ్, స్పీడ్లో ఏ ఎలక్ట్రిక్ బైక్ బెస్ట్?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!