Ponnam Prabhakar: బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం.. బీఆర్ఎస్, బీజేపీ… బీసీ ద్రోహులు..
- బీసీ రిజర్వేషన్ కి కట్టుబడి ఉన్నాం ..
- కొన్ని పార్టీలు బీసీ ల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నాయి..
- ప్రభుత్వంగా మేం చేయాల్సిన పనుల్ని చేశాం..
- కోర్టులో రిజర్వేషన్ కొట్టేస్తే నవ్వుకుంటున్నారు..
- కేంద్రలో మా ప్రభుత్వం ఉంటే గంటల్లో బీసీ రిజర్వేషన్ అమలులోకి వచ్చేది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: బీసీ రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీల కోసం పోరాడేది తాము మాత్రమేనని, ఇతర పార్టీలు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం మొసలి కన్నీళ్లు కారుస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు.. బీఆర్ఎస్, బీజేపీ. బలహీనవర్గాల ద్రోహులు అని మండిపడ్డారు.. గతంలో ఇతర రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ, ఈ పరిమితిని అధిగమించేందుకు ప్రభుత్వం సేకరించిన డాటా, నివేదికలు ఆధారంగా కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపిస్తున్నామని తెలిపారు.
Read Also: Telangana High Court: సిగాచీ పేలుళ్ల ఘటన… పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
Also Read
అసలు BRS కోర్టులో ఇంప్లీడ్ ఎందుకు కాలేదు? అని పొన్నం ప్రశ్నించారు.. సిగ్గులేకుండా బయట విమర్శలు చేసే బీఆర్ఎస్ నాయకులు కోర్టులో మాత్రం లేరు అని మంత్రి ఆరోపించారు. కోర్టులో రిజర్వేషన్ నిలిపేస్తే బీఆర్ఎస్ నేతలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. అటు.. బీసీ రిజర్వేషన్ల అమలులో అడ్డంకులు తొలగించేందుకు కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్న నిధులు ఇప్పించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేయడం లేదా? అని ప్రశ్నించారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 42% రిజర్వేషన్లతోనే జరపాలన్న ఆలోచన ఉందని తెలిపారు పొన్నం.. ఇక బీసీ సర్వేలో పాల్గొనని పార్టీలకు మాట్లాడే నైతిక హక్కు లేదని పొన్నం తీవ్రంగా హెచ్చరించారు. కేంద్రంలో మా ప్రభుత్వం ఉంటే గంటల్లో బీసీ రిజర్వేషన్ అమలు అయ్యేదన్న ఆయన.. మేము కోర్టులో చేస్తున్న పని మీకూ తెలుసు. తెలిసీ మాపై ఆరోపణలు చేయొద్దు. సలహాలు ఇవ్వండి.. తీసుకుంటాం.. కానీ, రాజకీయ పార్టీల ఒత్తిడికి లోనవ్వొద్దు అని సచించారు.. బీజేపీ–బీఆర్ఎస్ బీసీ ద్రోహులు అని మండిపడ్డారు పొన్నం.. బలహీన వర్గాల పట్ల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అన్యాయం చేశాయని తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగం ఏం చెబుతుందో తెలియకపోతే తెలుసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో వారికి హక్కుగా రిజర్వేషన్ ఇవ్వాలి.. బీసీ సర్వేలో పాల్గొనని వారు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదం.” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!