Hyderabad Water: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 2 రోజులు 30 ప్రాంతాల్లో నీళ్లు బంద్..
Hyderabad Water: హైదరాబాద్ వాసులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జల్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ మధ్యాహ్నం వరకు దాదాపు 30 ప్రాంతాల్లో పాక్షికంగా లేదా పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు. నగరంలో తాగునీటిని సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లై ఫేజ్-2లో కలబ్గూర్ నుంచి పటాన్చెరు వరకు పైప్లైన్ కోసం అధికారులు జంక్షన్ పనులు నిర్వహిస్తున్నారు. అయితే.. బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్డు వద్ద కొత్తగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ జంక్షన్ పనులు చేపడుతున్నారు.
ఈ ప్రాంతాల్లో నీరు నిలిచిపోతుంది..
Also Read
- Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
- Kavitha New Party: నేడే కవిత కొత్త పార్టీ ప్రకటన.. గన్ పార్క్ నుంచి మేడ్చల్ వరకు భారీ ర్యాలీ!
- RTC Strike Ends: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఇక సమ్మె క్లోజ్!
- IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ల బదిలీ
* O&M డివిజన్ నెం.6: అమీర్ పేట్, SR నగర్, ఎర్రగడ్డ
* O&M డివిజన్ నెం.8: ఆఫ్ టేక్ పాయింట్లు, ఈ డివిజన్ కింద బల్క్ కనెక్షన్లు
* O&M డివిజన్ నెం.9: KPHB కాలనీ, కూకట్పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్ట
* O&M డివిజన్ నెం.15: ఆర్సిపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, దీప్తిశ్రీనగర్, మదీనాగూడ, మియాపూర్
* O&M డివిజన్ నెం.24: బీరంగూడ, అమీన్పూర్
పైన పేర్కొన్న ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో నివసించే వినియోగదారులు మంజీరా నీటిని పొదుపుగా వాడుకోవాలని, వాటర్ రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదని సూచించారు. 30 ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని తెలిపారు. ఆగస్టు 19 ఉదయం నుంచి 20 మధ్యాహ్నం వరకు నీటిని నిలిపి వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఫిబ్రవరిలో కూడా ఇదే పరిస్థితి.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ మురుగునీటి బోర్డు (హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి) మరమ్మతు పనులు చేపడుతున్నందున హైదరాబాద్లోని చాలా చోట్ల 30 గంటల తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. పత్రికా ప్రకటన ప్రకారం, కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (కెడిడబ్ల్యుఎస్పి) ఫేజ్-2కి సంబంధించి 1600 ఎంఎం డయా పైప్లైన్ మరమ్మతు పనుల మధ్య ఫిబ్రవరి 4, 5 తేదీల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఎస్ఆర్డీపీలో భాగంగా బైరామల్గూడ జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా మరమ్మతులు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు బాలాపూర్, మేకలమండి, మారేడ్పల్లి, తార్నాక, లాలాపేట్, బుద్ధనగర్, హస్మత్పేట్, ఫిరోజ్గూడ, భోలక్పూర్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Shankar: ఈయన కమర్షియల్ సినిమాలకి గేమ్ ఛేంజర్
తాజావార్తలు
-
Bad Breath Remedies: నోటి దుర్వాసనతో విసిగిపోయారా.? ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.!
-
Ampere Magnus Neo: ఫ్యామిలీ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆంపియర్ మాగ్నస్ నియో రిలీజ్.. 10 సంవత్సరాల బ్యాటరీ లైఫ్
-
Russia: మరణానికి బ్రేక్..150 ఏళ్లు జీవించవచ్చు.. పుతిన్ కల దిశగా రష్యా..
-
IPL Slapgate: చెంపదెబ్బతో కోటి సంపాదన.. శ్రీశాంత్ హర్భజన్పై సంచలన ఆరోపణలు.. స్లాప్గేట్ మళ్లీ వార్తల్లో
-
AIDS: ప్రతీ నలుగురిలో ఒకరికి HIV.. ఇలా ఉన్నారేంట్రా ఇక్కడ..?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!