V. Hanumantha Rao: రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలి.. కుల గణన పై హనుమంతరావు
- ప్రభుత్వం ఏర్పడితే వెంటనే కుల గణన చేపడతామన్నారు..
- కుల గణన చేపడితేనే ఆయా వర్గాలు అభివృద్ధి ..
- అన్ని పార్టీలు కూడా కులగణనకు మద్దతు ..
- రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V. Hanumantha Rao: అంబర్ పేట్ లోని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు, చీర సారెలను సమర్పిస్తున్నారు. అమ్మవారికి మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులవి హనుమంతరావు మాట్లాడుతూ.. బోనాల పండగ మా తెలంగాణ సంస్కృతి అమ్మవారికి చీరా సారెలను సమర్పించి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో అందరిని చల్లగా చూడమని అమ్మవారిని వేడుకుని ఇంటి ఆడపడుచులను అల్లుళ్లను పిలుచుకొని వారికి చక్కని విందు ఇచ్చి మర్యాదగా చూసుకునే సాంప్రదాయమని వి హనుమంతరావు పండగ విశిష్టతను తెలిపారు.
Read also: Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి కల్వకుర్తి పర్యటన..
Also Read
- KTR: '8+8 = 0'.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
- Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
అంబర్పేట మహంకాళి అమ్మవారి దయతోనే పార్టీలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల్లోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగాడని తెలిపారు. రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి వెనుకబడిన తరగతుల ఇబ్బందులను తెలుసుకొని జనాభా ప్రాతిపదికనన కుల గణన చేపడితేనే ఆయా వర్గాలు అభివృద్ధి చెందుతాయానిని తమ ప్రభుత్వం ఏర్పడితే వెంటనే కులగణన చేపడతామని తెలిపారు. అదే సమయంలో ఇది ఇటు కేంద్ర ప్రభుత్వంపై కూడా కుల గణన చేపట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. అమ్మవారి దయతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యావు ఇప్పటికే కుల గణన పై అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టడం జరిగిందని అదే సమయంలో కుల గణన జరిగిన తర్వాతనే, నగర పాలిక, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఒక బీజేపీ పార్టీని మినహాయించుకుంటే అన్ని పార్టీలు కూడా కులగణనకు మద్దతు ఇస్తున్నాయన్నారు అలా కాకుండా ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించినట్లయితే బీసీలకు తీవ్రని అన్యాయం జరుగుతుందని పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని దాని ప్రభావం జాతీయ స్థాయిలో కూడా పార్టీపై ప్రభావం చూపుతోందని తెలిపారు.. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టకుండా ఎన్నికలు నిర్వహించరాదని దానివల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని అందువల్ల రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని అమ్మవారిని వేడుకున్నట్లు హనుమంతరావు తెలిపారు..
MLA Raja Singh: ఢిల్లీలో జరిగింది.. తెలంగాణలో కూడా జరగవచ్చు..
తాజావార్తలు
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్పై రోజా సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..